జమ్ముకశ్మీర్ కు తగిన సమయంలో రాష్ట్రహోదా
జమ్మూ కశ్మీర్ కు తగిన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్సభలో షా ప్రసంగించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో అధికార పంపిణీ జరుగుతోందని…ప్రతి అంశానికీ వివరణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.పంచాయతీ ఎన్నికల్లో 51 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రత్యర్థులు ఎత్తి చూపే అవకాశం ఇవ్వబోమన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం జమ్మూ కశ్మీర్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. కశ్మీర్ అభివృద్ధే మా ప్రాధాన్యం. తగిన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఏం చేసిందో అందరికీ తెలుసని…..హింస, అశాంతితో కూడిన పాతరోజులు కశ్మీర్ కు ఇక మళ్లీ రావని అన్నారు. పునర్ వ్యవస్థ…
జమ్మూకశ్మీర్ కు తగిన సమయంలో రాష్ట్ర్ హో