భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నుంచే జార్జ్ సరోస్ కు నెహ్రూ కుటుంబసభ్యులతో ఉన్న సంబధాలు బహిర్గతం
నరేంద్రమోదీ మీద అంతర్జాతీయ వేదికమీద నోరుపారేసుకున్న కారణంగా బిజెపి సోషల్ మీడియా వాళ్ళు జార్జ్ సరోస్ గతచరిత్ర తవ్వి తీసే కార్యక్రమం మొదలైంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి ముందే నెహ్రూ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయనే విషయం అతడి నోటిదూల కారణంగా బయటపడింది. రెండవ ప్రపంచయుద్ధంలో యూరోప్ దేశాలలో యూదుల తాట తీసే కార్యక్రమం జోరుగా సాగుతున్న సమయంలో జార్జ్ సరోస్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో ఒక బికారిలాగా బతికేవాడు. ఆ సమయంలో తనలాగే యూదు మతస్తురాలైన, తన దేశానికే చెందిన మాగ్డలీన్ ఫ్రైడ్ మాన్ తో అతనికి “మితృత్వం” ఏర్పడింది.
తరువాత కాలం కలిసొచ్చి జార్జ్ సరోస్ అమెరికాకు వలసపోతే “మేగ్డలీన్ ఫ్రైడ్ మాన్’ బ్రిటన్ కు వలసవెళ్లి అక్కడ చదువుకుంటున్న నెహ్రూ కుటుంబానికి చెందిన బ్రజ్ కుమార్ నెహ్రూకు గాలం వేసి పెళ్ళి చేసుకుని తన పేరును శోభానెహ్రూగా మార్చుకుని భారతదేశంలో కోడలిగా అడుగుపెట్టింది.
నెహ్రూ తండ్రైన మోతీలాల్ నెహ్రూ సోదరుడికి మనవడు, ఇందిరాగాంధీకి కజిన్ సోదరుడైన బ్రజ్ కుమార్ నెహ్రూ స్వాతంత్య్రపోరాటం జరుగుతున్న సమయంలో బుద్ధిగా బ్రిటీష్ ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటూ పంజాబ్ ప్రావిన్స్ లో ఇండియన్ సివిల్ సర్వీస్ లో అనేక పదవీబాధ్యతలు నిర్వహించాడు.
శోభానెహ్రూగా మారిన మాగ్డలీన్ ఫ్రైడ్ మాన్ దేశవిభజన కారణంగా తలెత్తిన హింస వల్ల పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలసవచ్చిన ముస్లిం శరణార్ధుల కుటుబాలకు చెందిన స్త్రీలు తయారు చేసిన చేనేత వస్త్రాలలాంటివి మార్కెటింగ్ చేసుకోవడానికి “కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం” అనే సంస్థను స్థాపించి నాటి కాంగ్రెస్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది.
బ్రజ్ కుమార్ నెహ్రూ స్వాతంత్ర్యానంతరం వరల్డ్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, భారత ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా, అమెరికా రాయబారకార్యాలయంలో ఆర్థిక మంత్రిగా, లండన్ భారత హైకమిషనర్ గా పనిచేశారు. రాజకీయంగా అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, జమ్మూకాశ్మీర్, గుజరాత్ ఇలా మొత్తం ఏడురాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. భద్రతామండలిలో శాశ్వతసభ్యత్వాన్ని జవహర్ లాల్ తిరస్కరించినట్టే బ్రజ్ కుమార్ నెహ్రూ తనకు ఐక్యరాజ్యసమితికి జనరల్ సెక్రటరీగా అవకాశం వచ్చినా తిరస్కరించారు.
బ్రజ్ కుమార్ నెహ్రూ ద్వారా ఇందిరాగాంధీని ప్రభావితం చేసిన శోభానెహ్రూ బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో శరణార్ధుల కోసం పనిచేసింది. అలాగే ఎమర్జెన్సీ నాటి బలవంతపు కుటుంబనియంత్రణ ఆపరేషన్ల కోసం శోభానెహ్రూ కూడా కొన్ని శిబిరాలు నిర్వహించారు.
భారతప్రభుత్వంలో అనేక కీలక పదువులు నిర్వహించిన బ్రజ్ కుమార్ నెహ్రూ భార్యైన శోభానెహ్రూతో జార్జ్ సరోస్ ఆమె బతికున్నంతకాలం సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడని, అమెరికా నుంచి ఛార్టెడ్ విమానంలో వచ్చి తరచుగా కలిసేవాడని జాతీయవాద మీడియా ఆరోపిస్తోంది. చివరిగా జార్జ్ సరోస్ 2009లో శోభానెహ్రూను కలవడానికి ఛార్టెడ్ విమానంలో చండీగఢ్ వచ్చిన విషయాన్ని జాతీయ మీడియా కూడా నమోదు చేసింది. 2017లో హిమాచల్ ప్రదేశ్ లో ఆమె మరణించారు.
ఇక్కడ ప్రధానంగా గమనించతగిన విషయాలు
1. భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే నెహ్రూ కుటుంబానికి శోభానెహ్రూ రూపంలో జార్జ్ సరోస్ తో సన్నిహిత సంబంధాలున్నాయి.
2. బ్రజ్ కుమార్ నెహ్రూ జమ్మూకాశ్మీర్ గవర్నర్ గా పనిచేస్తున్న సమయంలో వేర్పాటువాద షేక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా బర్త్ రఫ్ చేయడానికి నిరాకరించిన కారణంగా ఆగ్రహించిన ఇందిరాగాంధీ రాత్రికిరాత్రి ఆయనను గుజరాత్ గవర్నర్ గా పంపించి కొత్తగా తనకు అనుకూలుడైన జగన్మోహన్ మల్హోత్రాను జమ్మూకాశ్మీర్ గవర్నర్ గా నియమించారు. మరో మూడు నెలల తర్వాత బ్లూస్టార్ ఆపరేషన్, మరో మూడు నెలలకు ఇందిరాగాంధీ హత్య జరిగాయి.
3. అప్పటికి పదమూడేళ్ళ క్రితమే ఇందిరాగాంధీ అమెరికా బెదిరింపులు లెక్క చేయకుండా పాకిస్తాన్ పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడేమో విదేశీ మద్దతుతో రక్తపాతం సృష్టిస్తున్న ఖలిస్తానీలను బ్లూస్టార్ ఆపరేషన్ లో అంతంచేశారు. ఆమె తరువాతి టార్గెట్ విదేశాల మద్దతు ఉన్న షేక్ అబ్దుల్లా లాంటి కాశ్మీర్ వేర్పాటువాద నాయకులే. దాని కోసం బంధువైనా కూడా లెక్కచేయకుండా బ్రజ్ కుమార్ నెహ్రూను రాత్రికి రాత్రి గుజరాత్ కు పంపించేశారు. ప్రధానమంత్రి-గవర్నర్ ల స్థాయిలోజరిగే రాజకీయ రహస్యాలు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండే యూరోప్-అమెరికా దేశాలకు శోభానెహ్రూ లాంటి లోపలి వ్యక్తుల ద్వారా లీక్ కావడం ఇందిరాగాంధీ హత్యకు కారణం కావచ్చు
4. సోనియాగాంధీకి సన్నిహితుడు, యూపీఏ హయాంలో సూపర్ కేబినెట్ గా పేరుపొందిన నేషనల్ అడ్వైజరీకమిటీ సభ్యుడు కూడా అయిన హర్షమందార్ కు జార్జ్ సరోస్ తన ఫౌండేషన్ లో కీలకపదవి ఇచ్చిన కారణంగా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తో పరోక్షంగా ఉన్న సంబంధాల వల్ల అతనికి సోనియాగాంధీతో కూడా శోభానెహ్రూతో ఉన్న సాన్నిహిత్యమే ఉంది. శోభానెహ్రూ హంగేరీ నుంచి, సోనియాగాంధీ ఇటలీ నుంచి లండన్ కువలస వచ్చి అక్కడ ఉన్నతవిద్యకోసం వచ్చిన బ్రజ్ కుమార్ నెహ్రూ, రాజీవ్ గాంధీలను పెళ్లి చేసుకుని ఇద్దరూ తమ అసలు పేర్లు మార్చుకుని భారతదేశానికి వచ్చారు.
5. ఏగూటి చిలక ఆగూటి పలుకే పలుకుతుందన్నట్టు తాను పుట్టినదేశంలో పడిన కష్టాలకారణంగా శరణార్ధి జీవితం గడిపిన జార్జ్ సరోస్ ప్రపంచవ్యాప్తంగా శరణార్ధుల కోసం ఎన్జీవోల ద్వారా ఫండింగ్ ఇస్తున్నాడు. శరణార్ధిగా బ్రిటన్ వెళ్లిన శోభానెహ్రూ భారతదేశం వచ్చాక పాకిస్తాన్, బంగ్లాదేశ్ శరణార్ధుల కోసం ఒక సంస్థ స్థాపించి సహాయం చేసింది. ఇటలీ నుంచి వలసవచ్చిన సోనియాగాంధీ కూడా CAA విషయంలో బంగ్లాదేశ్, మయన్మార్ శరణార్ధులకు అనుకూలంగా రాజకీయంగా మద్దతిచ్ఛిన సంగతి తెలిసిందే. ఎంతసేపూ మైనారిటీలు, శరణార్ధుల సమస్యలు, వాళ్ళతో ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప అదే శరణార్ధుల కారణంగా మెజారిటీ ప్రజలకు, ఆశ్రయమిచ్చిన దేశానికి వచ్చే సమస్యలు వీళ్ళకు అనవసరం. తమ చేతిలో ఉన్న మీడియా ద్వారా మెజారిటీ ప్రజలను దోషులుగా చిత్రించడం, వాళ్లు సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ఇగ్నోర్ చేయడం వీళ్ళ నైజం
5. భారతదేశానికి సంబంధించినంత వరకు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల సంతానాన్ని ప్రేమ పేరుతో హనీట్రాప్ చేయడం లేదా మతమార్పిడి చేయడం ఒక సమస్యగా కనబడుతోంది. ఒకవేళ సోనియాగాంధీ స్థానంలో ఒక భారతీయ మహిళ కనుక ఉంటే ఆర్టికల్ 370రద్దు , CAA విషయంలో మద్దతు ఇచ్చేవారు. ఉదాహరణకు సినీ నటి నవనీత్ కౌర్ ఆర్టికల్ 370 కి మద్దతు ఇచ్చారు. ఒక దేశం పట్ల నిబద్ధత ఆ దేశపౌరులకు మాత్రమే ఉంటుంది.
6. మాజీ ప్రధానమంత్రి ఐకె గుజ్రాల్, మన్మోహన్ సింగ్, షారుఖ్ ఖాన్ ఇలా రాజకీయ, సినిమా, వైద్య, పత్రికా రంగాల్లో విదేశీ మూలాలు కలిగిన ప్రముఖులే కాదు జాగ్రత్తగా గమనిస్తే సాధారణ వ్యక్తులు కూడా చాలామంది కనబడతారు. నేను ప్రత్యక్షంగా చూసిన కొందరు సినిమానటులు, వైద్యులు హిందూ పేర్లతో ఉన్నా అచ్చంగా యూరోపియన్లలాగా ఉంటారు. సమాజం పట్ల, దేశం పట్ల వారి వైఖరి కూడా తేడాగా ఉంటుంది. వెయ్యేళ్ళపాటు సాగిన విదేశీ పాలనలో ఎవరు ఏసమయంలో ఎలా భారతదేశంలో దూరి ఏపేర్లతో చలామణి అవుతున్నారో గుర్తించటం కష్టం. ఇంకా మనకు తెలియని ఎంతమంది శోభానెహ్రూలు, సోనియాగాంధీలు పెద్ద సంఖ్యలోనే ఉండవచ్చు.
రిఫరెన్సులు :
2009లో శోభానెహ్రూను కలవడం కోసం జార్జ్ సరోస్ భారత పర్యటన వార్త http://archive.indianexpress.com/news/mr-soros-goes-to-meet-an-old-friend/467702/
నెహ్రూ కుటుంబం-జార్జ్ సరోస్ సంబంధాలపై స్వరాజ్య మేగజైన్ వివరణ
https://swarajyamag.com/commentary/who-is-george-soros-and-what-is-his-link-to-the-nehru-gandhis
శోభానెహ్రూ-జార్జ్ సరోస్-సోనియాగాంధీ-హర్షమందార్ ల మధ్య లింకులు
https://www.opindia.com/2023/02/george-soros-fori-nehru-gandhi-dynasty-connection/