న్యూయార్క్ తులసీమందిర్లోని గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆసమయంలో విగ్రహం చుట్టూ తిరుగుతూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. తరువాత వారంతా కార్లో పారిపోయారని అక్కడున్నవారు చెబుతున్నారు. అమెరికాలో గాంధీ విగ్రహాల విధ్వంసం, దాడులు కొత్తకాదు. ఇది రెండోసారి. తులసీమందిర్లోని ఈ విగ్రహం పైనే ఈనెల 3న మొదటిసారి దాడి జరిగింది. 16న రెండోసారి కార్లో వచ్చి ధ్వంసం చేశారు. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. దుండగులు 25 నుంచి 30 ఏళ్ల మధ్యవయసు వారని చెబుతున్నారు.
https://twitter.com/COPCP2020/status/1559650185034100738?s=20&t=qKdLsCABxvkCd-Uin1es1g