అధర్వణ వేదం లోని భూమిసూక్తానికి ఆధునిక వ్యాఖ్యానం వందేమాతరం పుట్టింది వంగ భూమిలోనే , ఈస్టిండియా కంపెనీ పేరుతొ ఆంగ్లేయలు మొట్ట మొదట అడుగు పెట్టింది వంగ భూమిలోనే, వంగ భూమిలో ఒక ప్రక్క బంగాళాఖాతం మరో ప్రక్క హిమాలయాలు దర్శనమిస్తుంటాయి . ఈ ఆధునిక కాలంలో సాంస్కృతిక జాతీయవాదానికి పునాదులు వేసిన అరవింద, వివేకానంద జన్మించింది కూడా వంగభూమిలోనే , స్వాతంత్ర పోరాటంలో ప్రసిద్ధి పొందిన అనేకమంద మహా పురుషులు ఈ గడ్డమీదే జన్మించారు. పాశ్చాత్య ప్రపంచంలో పుట్టిన కమ్యూనిజం సిద్ధాంతం భారతదేశంలో మొట్టమొదట పురుడుపోసుకుంది కూడా వంగ భూమిలోనే, స్వాతంత్ర పోరాటంలో ఇస్లాం ఆధారంగా ఈ దేశం ముక్కలు చేయడానికి నాంది పలికింది కూడా ఈ వంగ భూమిలోనే,బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ప్రావెన్స్ లో ముస్లిం ఆధిపత్యం ఉన్న భాగాలతో ఢాకా కేంద్రంగా తూర్పు బెంగాల్ గా బెంగాల్ విభజన చేశారు, అదే నేటి బంగ్లాదేశ్. స్వాతంత్ర పోరాట కాలంలో అనేక రకాల సిద్ధాంతాల సంఘర్షణలో నలిగిపోయింది కూడా బెంగాల్ అని చెప్పటం ఎటువంటి అతిశయోక్తి లేదు ”ఈ రోజు బెంగాల్ ఏమి ఆలోచిస్తుందో అదే రేపు భారత్ ఆలోచిస్తోంది”అని బెంగాల్ వాళ్ళు చెప్పుకొంటూఉంటారు అట్లా బెంగాల్ యావత్ దేశానికీ ప్రపంచానికి బాగాపరిచయం, అటువంటి బెంగాల్ మళ్లీ 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది .
బెంగాల్ చరిత్రనిమలుపులు త్రిప్పిన ఇస్లాం, కమ్యూనిజం
ప్రపంచంలో ఎక్కడైనా వామపక్ష సిద్ధాంతం, ఎడారి మతాల ఆదిత్యం ఉన్న దగ్గర ఆక్రమణ , సంఘర్షణ, హత్యా రాజకీయాలు అరాచక పరిస్థితులు అతి సహజం సంఘర్షణలతో, దమనకాండ తో ప్రపంచంలో అనేక దేశాలు కమ్యూనిస్టు దేశాలు అయినాయి , కానీ జాతీయవాద శక్తులు శక్తి వంతమైనప్పుడు ఆ దేశాలలో కమ్యూనిజం కాలగర్భంలో కలిసిపోయింది, అటువంటి కమ్యూనిజం, రాజకీయం మతం సమ్మిళితమైన ఎడారి మతం ఇస్లాం, ఈ రెండు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఈ రెండు శక్తులు బలంగా ఉన్న కేంద్రం బెంగాల్, ఒకప్పుడు ఆధునిక జాతీయ వాదానికి కేంద్రబిందువైన బెంగాల్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇస్లాం, కమ్యూనిజం కబంధహస్తాల్లో పడి నలిగిపోతున్నది.స్వాతంత్ర పోరాట సమయంలో దేశంలో మలుపులు తిరిగిన రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవడం అవసరం. 1] దేశ విభజన తర్వాత భారత్ కు స్వాతంత్రం వచ్చింది, దేశ విభజనలో విభజనకు గురి అయిన ప్రావెన్సీలు పంజాబ్, బెంగాల్ , సింధు ప్రాంతం ప్రముఖంగా మనకు కనబడతాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత సరిహద్దులలో ముస్లిం ఆధిపత్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో 1} కశ్మీర్ 2}పంజాబ్ 3}పశ్చిమ బెంగాల్ 4} అస్సాం ఇందులో లో కాశ్మీర్, పంజాబ్ లు పాకిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రం, బెంగాల్ , అస్సాం లు ఇస్లామీకరణ కు బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు జరుగుతూనే ఉన్నాయి2] స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి బెంగాల్ రాజకీయాలపై ఒక ప్రక్క ఇస్లాం మరో ప్రక్క కమ్యూనిజం, మావోయిజం లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి . అటువంటి బెంగాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో జాతీయవాద శక్తుల సమరభేరీ మ్రోగింది, ఆ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది, బిజెపి 77 స్థానాల తో , రెండవ స్థానంలో నిలిచింది . ఈ ఫలితాల పై ఒక్కొక్కరు ఒకొక్క రకమైన వ్యాఖ్యానాలు చేశారు .అందులో కొందరు రాబోవు రోజుల్లో బెంగాల్ హిందుత్వ శక్తుల సమర భూమి అన్నారు, మరి కొందరు బెంగాల్ లో గెలిచిన మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని అన్నారు , ఇంకా కొందరు బెంగాల్ లో మోడీ ని అడ్డుకున్నమమతాబెనర్జీ 2024 పార్లమెంటు ఎన్నికలలో ప్రతిపక్షకూటమికి నాయకత్వం వహించాలని అన్నారు, మొత్తం మీద బెంగాలులో బీజేపీ ఓడిపోయింది అని పత్రికలలో వ్యాసాల పరంపర తో , ఛానళ్లు లో చర్చలతో దేశం హోరెత్తించారు ఎన్నికల అనంతరం బెంగాల్లో జరిగిన రాజకీయ దాడులు కూడా దేశం దృష్టి ఆకర్షించాయి. బెంగాల్ లో 1951- 52 సంవత్సరంలో జరిగిన మొట్ట మొదటి అసెంబ్లీ ఎన్నికల నాడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో 2021 లో జరిగిన ఎన్నికల సమయం లో కూడా అటువంటి పరిస్థితులు కనబడ్డాయి. 19వ శతాబ్దంలో బెంగాల్ లో రెండు భావజాలాలు పుట్టుకొచ్చాయి, అవి ఆ రాష్ట్రాన్ని ఎంతో ప్రభావితం చేశాయి, అందులో 1] హిందూ జాతీయవాదం 2] సామ్రాజ్యవాద వ్యతిరేక రాడికలిజం . ఈ రెండూ కూడా ఒక సమయంలో సాయుధ తిరుగుబాటు కు ప్రేరణ ఇచ్చాయి. జాతీయవాద ప్రయోగాలు సుదీర్ఘంగా కొనసాగి స్వాతంత్రానంతరం క్రమంగా తెర మరుగు కావడం ప్రారంభమైంది ఆ సమయంలో ఆ స్థానాన్ని కమ్యూనిజం క్రమంగా ఆక్రమించింది. కమ్యూనిజం తెలివిగా హిందూ జాతీయవాదం కి ప్రత్యమ్నాయంగా బెంగాలీ జాతీయవాదాన్ని లేవకొట్టింది తృణముల్ కాంగ్రెస్ దానిని తెలివిగా ఉపయోగించుకుని స్థిరపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది ఆ విషయాలను స్థూలంగా తెలుసుకొందాము.
పశ్చిమబెంగాల్లో 1951- 52 వ సంవత్సరంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్{ ఐ. ఎన్. సి} ఆ రాష్ట్రంలో ఉన్న 238 సీట్లలో 150 సీట్లు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యతతో పాలనా పగ్గాలు చేపట్టింది. ఆ సమయంలో జాతీయ వాద రాజకీయ పక్షాలైన హిందూ మహాసభ, భారతీయ జనసంఘ్ కేవలం 13 సీట్లు మాత్రమే గెలుచుకొంది , అదే ఆ విభక్త కమ్యూనిస్టు పార్టీ{సి.ఫి .ఐ} 41 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 16 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించింది. అదే జాతీయ పార్టీలైన హిందూ మహాసభ భారతీయ జనసంఘ్ 1957 ఎన్నికల నుండి 2016 సంవత్సరం ఎన్నికల వరకు ఒక్క సీటు కూడా గెలవ లేదు. కమ్యూనిస్టు పార్టీ క్రమంగా బలపడుతూ 1967 సంవత్సరంలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, దీనికి తెరవెనుక ఆ రాష్ట్రంలో ప్రముఖ ఇస్లాం నాయకుడైన హుమాయిన్ కబీర్ పని చేశాడు, ఆ క్రమంలో 1977 సంవత్సరం నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి కమ్యూనిస్టుల పాలన ప్రారంభమైంది. 1977 నుండి 2011 వరకు అంటే 33 సంవత్సరాల పాటు కమ్యూనిస్టులు సుదీర్ఘంగా ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు, ఆ సమయంలో కమ్యూనిస్టు లకు కాంగ్రెస్ కు మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగాయి. కమ్యూనిస్టుల దాడులు కాంగ్రెస్ విధానాలతో విసిగిపోయిన మమతా దీదీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కమ్యూనిస్టులను ధీటుగా ఎదిరించి నిలబడింది .1998 లోమమతాబెనర్జీ తృణముల్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసింది. 1998 లో ఏర్పాటు చేయబడ్డ పార్టీ 2011లో అధికార పగ్గాలు చేపట్టింది, అప్పటి నుండి మమతా బెనర్జీ ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నది. ఆ క్రమంలో మమతా బెనర్జీకి కమ్యూనిస్టులతో సుదీర్ఘ సంఘర్షణ జరిగింది ఆ సంఘర్షణ పర్యవసానం బెంగాల్లో కమ్యూనిజం నామమాత్రంగా మిగిలి పోయింది. బిజెపి ప్రారంభమైనప్పటి నుండి ఆ రాష్ట్రంలోకూడా తన బలాన్ని పెంచుకుంటూ శక్తివంతం అవుతున్న, ఆ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీ .మధ్య 2013 నుండి ప్రారంభమైన సంఘర్షణలు 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో అదేవిధంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు తరువాత చోటు , చేసుకున్నా దాడులతో అదాడులు పరాకాష్టకు చేరుతున్నాయని చెప్పుకోవచ్చు.. ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ గెలిచి అధికారం చేపట్టింది. రాష్ట్రంలో తమ అధికారానికి సవాలు విసురుతున్న బీజేపీనీ ఆ రాష్ట్రంలోబలహీనం చేసేందుకు అనేక ప్రయత్నాలు ప్రారంభించింది. బెంగాల్ రాజకీయాలలో దశాబ్దాల సంఘర్షణ పరిణామము కాంగ్రెస్ కమ్యూనిస్టులు నామమాత్రంగా మిగిలిపోయి పోరాటం ప్రాంతీయ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్, బిజెపి ల మధ్య ఇప్పుడు నడుస్తున్నది ఈ పోరాటం ఇంకా కొంతకాలం కొనసాగేట్లుగా కనబడుతున్నది. ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలలో లో కీలక పాత్ర పోషించే ముస్లిం ముస్లిం ఓట్ బ్యాంకు రాజకీయాలు , ముస్లిముల నుండి ఎదురవుతున్న సమస్యలను అవగాహన చేసుకోవడం ఎంతో అవసరం.
శతాబ్దాలు గా బెంగాల్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఇస్లాం
బ్రిటిష్ పాలన సమయంలో బెంగాల్లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ముస్లిం లీగ్ బలపడి విజయాన్ని సాధించి ఆధిపత్యం పెంచుకోవటం ప్రారంభించింది అది చివరకు బెంగాల్ విభజనకు దారి తీసింది, ఢాకా కేంద్రంగా తూర్పు బెంగాల్ ఏర్పడింది. స్వాతంత్రం వచ్చిన తరువాత పాకిస్తాన్ లో కలిసి పోయి తూర్పు పాకిస్తాన్ అయింది, ఆ తదుపరి బంగ్లాదేశ్ గా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. స్వాతంత్రం రాక పూర్వం నుండి ఇటు పశ్చిమబెంగాల్ అటు అస్సాం లను వలసలతో ఇస్లాం ముంచెత్తడం ప్రారంభించింది, అక్కడి రాజకీయాలను కూడా ప్రభావితం చేయటం ప్రారంభించింది, దీనితో పొలిటికల్ పోలరైజేషన్ ప్రారంభమయ్యింది. బెంగాల్ లో 30 శాతం ఉన్న ముస్లిముల భావజాలం బెంగాల్ రాజకీయాలను నిర్ణయించడం ఎప్పటినుండో మొదలైంది, అది ఇప్పటికీ కొనసాగుతోంది, బెంగాల్ లో ముస్లిం భావోద్వేగాలను రెచ్చగొట్టి బెంగాల్ రాజకీయాలను ప్రభావితం చేసిన ఏకైక ముస్లిం నాయకుడు హుమాయిన్ కబీర్, ఆయన తర్వాత అంతే ప్రభావితం చేస్తున్న మరో నాయకుడు అబ్బాస్సిద్ధిఖీ. గడిచిన 30 సంవత్సరాల నుండిబెంగాల్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ కమ్యూనిస్టుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు మమతా దీదీ తో కలిసి కమ్యూనిస్టు పాలనకు తెర దించేందుకు సుమారుగా తెరవెనుక ఉండి పని చేసింది అబ్బాస్ సిద్ధిఖీ నే. 2021 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి ముస్లిములలో మమతా దీదీ పైన కూడా డాఅసంతృప్తి ప్రారంభమైనది , కానీ ఆ రాష్ట్రంలో జాతీయ శక్తి బిజెపి కూడా పెరుగుతుండటం తో బీజేపీని అడ్డుకోవాలని ముస్లిం నాయకత్వం భావించింది, అబ్బాస్ సిద్ధిఖీ తెలివిగా ఇండియన్ నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశారు ముస్లింవోట్ చీలకుండా మమతా పార్టీకి ఓటు మళ్లేట్లుచేసి మమతా బెనర్జీ ని గెలిపించాడు , ఈ ఎన్నికల్లో అబ్బాస్ సిద్ధికి ఒక్క సీటు గెలుచుకున్నాడు . ఆ రాష్ట్రంలో 30 శాతం ఉన్న ముస్లింలు రాజకీయాలను శాసిస్తున్నాయి, కానీ 70 శాతం ఉన్న హిందువులు అక్కడి రాజకీయాలను శాసించలేకపోతున్నారు, భవిష్యత్తులో బెంగాల్ రాజకీయాలను ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే , ఎందుకంటే మమత బెనర్జీ పైన కూడా ముస్లిములలో అసంతృప్తి మొదలైంది, బిజెపి ని అడ్డుకొనేందుకు ఈ సారి మమతకే ముస్లిమ్స్ ఓట్లు వేశారు. మొత్తం మీద బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు నామమాత్రంగా మిగిలిపోతున్నారు, ఆ స్థానంలో బిజెపి క్రమంగా బలపడుతున్నది , ముస్లిములు కూడా తమ ఆధిపత్యానికి సంఘర్షణ కొనసాగిస్తారు. ఈ సమయంలో ఇండియన్ నేషనల్ ఫ్రంట్ ఎటువంటి రాజకీయా మలుపులకు లోనవుతుందో వేచిచూడాలి.
దశాబ్దాల హత్య రాజకీయాలకు తెరపడేదెన్నడు ?
సిపిఐ-ఎంపాలనలో పశ్చిమ బెంగాల్లో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయనే దానిపై స్పష్టమైన వివరాలు బయటకు రావడం కష్టమే అయినప్పటికీ, 1997 లో మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేబ్ భట్టాచార్జీచేసిన ప్రకటన ప్రకారం . 1977 మరియు 1996 మధ్య, రాష్ట్రంలో 28,000 రాజకీయ హత్యలు జరిగినట్లు తెలుస్తున్నది . 2010 లోవామపక్ష వారపత్రిక మెయిన్ స్ట్రీమ్ లో వచ్చిన వివరాల ప్రకారం 1977 మరియు 2009 మధ్యకాలంలో రాష్ట్రంలో 55,000 రాజకీయ హత్యలు జరిగాయని తెలుస్తున్నది. 2007 నందిగ్రామ్ పారిశ్రామిక ప్రాజెక్టు కోసం భూమిని స్వాధీనం చేసుకోవడానికి, రాష్ట్ర యంత్రాగం చేసిన ప్రయత్నంలో భారీగా ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో 14 మంది మరణించారు .అనేకమంది గాయపడ్డారు. 1998 లో తృణమూల్ కాంగ్రెస్ ప్రారంభించినప్పటినుండి 2020 వరకు1067 మంది తృణమూల్ కార్యకర్తలు చంపబడ్డారని చెబుతున్నారు. జూన్ 2013 నుండి 2020జులై వరకు 93 మంది బీజేపీ కార్యకర్తలు చంపబ డ్డారని బీజేపీచెప్పుతున్నది. 16మే 2009 నుండి 2019 నవంబర్ 18మధ్యకాలంలో 615 మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు హత్యచేయబడ్డారని కమ్యూనిస్టులు చేప్పుతున్నారు. ఈ హత్య రాజకీయాలకు తెరపడేదెన్నడో ? ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జరిగిన దాడులు మనం చూసాము రాబోవు రోజులలో రాజకీయ హత్యలకు తెరదించి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు బీజేపీ పెద్దఎత్తున ప్రజాఉద్యమంచేయవలసిన అవసరం ఉన్నది. జాతీయ చైతన్యంతోమళ్ళీ బెంగాల్ జాగృతం కావాలి.
రాంపల్లి మల్లికార్జున్