ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులే. మొదటినుంచి మహిళలకు సమంజసమైన ప్రాతినిధ్యం కల్పించడం తెలుగుదేశం పార్టీలో అలవాటు అదే మాదిరిగా దేశంలోనే మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడోవంతు సీట్లను మహిళలకి రిజర్వ్ చేయడం జరిగింది.
తాజాగా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారు. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ తరఫున గట్టి పోరాటం చేస్తున్న నాయకులుకి అవకాశం ఇచ్చారు రాయలసీమ ఉత్తరాంధ్ర లకు కూడా అవకాశం ఇచ్చారు.
*AP మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు
మహిళా మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి
1. అనిత వంగలపూడి (పాయకరావుపేట-SC): 2014లో పాయకరావుపేట TDP అభ్యర్థిగా గెలిచారు. 2019లో కొవ్వూరు నుంచి ఓడిపోయారు. 2024లో పాయకరావుపేట నుంచి గెలిచారు.
2. గుమ్మడి సంధ్యారాణి (సాలూరు- ST): డిప్యూటీ సీఎం రాజన్న దొరపై 13వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
3.ఎస్.సవిత (పెనుకొండ-BC కురుబ): శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండలో మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్ప పై గెలిచారు.
కాగా ఈ మంత్రివర్గంలో ముగ్గురు జనసేన సభ్యులకు ఒక బీజేపీ ఎమ్మెల్యేకి అవకాశం కల్పించారు. ఈ రెండు పార్టీల నుంచి మహిళలను మాత్రం మంత్రివర్గంలోకి తీసుకోలేదు.