మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తూ ఈరోజు ఉదయం గువాహతిలో శివసేన నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల రెబల్ గ్రూపులో మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చేరారు. ఇతర ఎమ్మెల్యేలు బస చేస్తున్న గువాహతిలోని రాడిసన్ బ్లూ హోటల్కు చేరుకున్నారు. ఏక్నాథ్ షిండే నాయకుడిగా కొనసాగుతారని 34 మంది ఎమ్మెల్యేల సంతకాలతో శివసేన లెజిస్లేచర్ పార్టీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి పంపారు.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వచ్చి నన్ను డిమాండ్ చేస్తే పదవి నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిన్న తన అధికారిక నివాసం ‘వర్ష’ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు. రాజకీయ సంక్షోభం కారణంగా శివసేన పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏక్నాథ్ షిండేను తొలగించింది. అయితే తిరుగుబాటుదారుల తీర్మానంతో పార్టీ అధిష్టానానికి ఎదురుదెబ్బ తగిలింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిన్న పార్టీ ఎమ్మెల్యేలు కోరితే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఫేస్బుక్లో సీఎం.. సేన నాయకులు, శాసనసభ్యులు తనకు వ్యతిరేకంగా ఉంటే పార్టీ చీఫ్ పదవిని కూడా వదులుకుంటానని అన్నారు. అయితే సూరత్ గువహతిలో క్యాంప్ చేస్తున్న అసంతృప్తి ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి రావాలని.. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగడం తమకు ఇష్టం లేదని తన ముఖం మీద చెప్పాలని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
శివసేన సంక్షోభాన్ని అధిగమించగలదని శివసేన నేత సంజయ్ రౌత్ విశ్వాసం వ్యక్తం చేశారు.
“ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనే సీఎంగా ఉంటారు. అవకాశం దొరికితే మెజారిటీ నిరూపించుకుంటాం’ అని అన్నారు.
అయితే, భిన్నమైన సిద్ధాంతాల కారణంగా ఎన్సిపి, భారత జాతీయ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల పార్టీ కార్యకర్తలలో విపరీతమైన అసంతృప్తి ఉందని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెప్పారు.