అప్పటికప్పుడు మూడుసార్లు దుస్తులు మార్చారు మోదీ. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా వారణాశి వెళ్లిన మోదీ ఒక్కో సందర్భంలో ఒక్కో డ్రెస్ లో కనిపించారు.
గోధుమరంగు కుర్తాలో వారణాశి చేరుకుని ఆ దుస్తులతోనే విశ్వనాథుడి పూజలో పాల్గొన్నారు. తరువాత ఎరుపురంగు కుర్తాధరించి గంగలో పుణ్యస్నానాలాచరించారు. తరువాత బంగారు వర్ణపు కుర్తా ధరించి మళ్లీ విశ్వనాథాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.