ఫిబ్రవరి 17న తన పుట్టినరోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించిన కేసీఆర్… ఈ కార్యక్రమానికి మరికొందరు నేతల్ని ఆహ్వానిస్తారు. ఈసారి ఇద్దరు సీఎంలు, ఒక ఉపముఖ్యమంత్రితో పాటు ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడు హాజరుకానున్నారు. సచివాలయ భవనం ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగసభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019 జూన్ 27న సచివాలయం నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.