తన అరెస్టులపై స్టే విధించాలంటూ నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలపై ఆమెపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. తనను రేప్ చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపులు వస్తూనే ఉన్నాయని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు మందలించిన తరువాత తనకు ప్రాణహాని మరింత పెరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తల నరికేస్తామని నిరంతరం కాల్స్, మెసేజుల ద్వారా
చాలామంది భయపెడుతున్నారని ఆమె వాపోయారు. తనపై వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నింటినీ కలిపి విచారించాలంటూ ఆమె మరోసారి కోర్టుకు విన్నవించారు. గతంలో కూడా ఇదే విజ్ఞాపనతో వెళ్లిన ఆమెను సుప్రీంధర్మాసనం మందలించిన సంగతి తెలిసిందే. కన్నయ్యలాల్ హత్యకు నూపుర్ వ్యాఖ్యలే కారణమని…దేశం తగులబడే పరిస్థితి ఆమె వల్లే వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలే చేసింది కోర్డు. నాడు పిటిషన్ ను తిరస్కరించినన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలాతో కూడిన ధర్మాసనమే విచారణ జరపనుంది.