భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ ఢిల్లీ యూనిట్ నేత నూపుర్ శర్మకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో అనేక హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబేర్ ఆమెపై దాడి చేసేలా ట్రోల్లను ప్రోత్సహించే విధంగా వక్రీకృత వ్యాఖ్యానంతో ఆమె వీడియోను షేర్ చేసిన తర్వాత కొందరు ఆమెను బెదిరిస్తూ పలు ట్వీట్లు చేశారు, కొందరు ఆమె తలా నరకాలంటూ పిలుపునిస్తున్నారు.
నూపుర్ షేర్ చేసిన ట్వీట్లలో, ఆమె ప్రాణాలకు బహిరంగ బెదిరింపులు, తల నరుకుతామని కాల్స్ వస్తున్నాయని.. ఆమె కేవలం 4 ట్వీట్లను మాత్రమే షేర్ చేసినప్పటికీ.. జుబేర్ ఆమెపై దాడులను ప్రోత్సహించినప్పటి నుంచి ఆమెకు వ్యతిరేకంగా ఇలాంటి అనేక ట్వీట్లు వచ్చాయని చెప్పారు.
వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వివాదంపై టైమ్స్ నౌలో జరిగిన చర్చలో నూపుర్ శర్మ పాల్గొన్నారు. అందులో నూపుర్ హిందూ పక్షం వైపు నుంచి వాదించారు. ముస్లిం ప్రజలు హిందూ విశ్వాసాన్ని పదేపదే అపహాస్యం చేస్తున్నారు, వారు ఇస్లామిక్ విశ్వాసాలను సూచిస్తూ ఇతర మతాలను కూడా ఎగతాళి చేస్తున్నారని అన్నారు. ఆ వీడియోను జుబైర్ తన 464,000 మంది ట్విట్టర్ ఫాలోవర్లతో నూపుర్ను తీవ్రమైన మత ద్వేషి అని.. అల్లర్లను ప్రేరేపించగల వ్యక్తిగా ప్రకటించాడు.
దేంతో అనేకమంది నూపుర్ ను టాగ్ చేస్తూ బెదిరింపులు ప్రకటిస్తున్నారు. తన టైంలైన్ లోని ఆ ట్వీట్లను స్క్రీన్ షాట్ లు తీసి ఢిల్లీ పోలీసులకు పంపించారు.
పదే పదే ట్యాగ్ చేసిన తర్వాత.. ఢిల్లీ పోలీసులు చివరకు ప్రతిస్పందించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేశామని.. వారు బాధిత నూపుర్ శర్మను త్వరలో సంప్రదిస్తామని చెప్పారు.
ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు జుబేర్ ఆరోపణల వళ్ల ఒకరికి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు.
:@DelhiPolice @CPDelhi I am getting continuous death and beheading threats against my family and myself which are egged on by @zoo_bear because of his attempts to incite communal passions and vitiate the atmosphere by building a fake narrative.
Attaching a few pics. Please note. pic.twitter.com/QmgA2uRCrS
— Nupur Sharma (@NupurSharmaBJP) May 27, 2022