కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి దావూద్ గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. కర్ణాటక బెలగావి జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తినుంచి ఆ కాల్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. తాను దావూద్ ఇబ్రహీం ముఠాలో సభ్యుడని అతను ఒప్పుకున్నట్టు తెలిసింది. అతన్ని జయేశ్ పూజారిగా గుర్తించారు. ఓ హత్య కేసులో కోర్టు జయేష్ కు మరణశిక్ష విధించింది. అతన్ని ప్రశ్నించేందుకు జైలు అధికారులు నాగ్పూర్ పోలీసులు అనుమతి ఇచ్చారు. నాగ్పూర్ ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయానికి మొత్తం మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో గడ్కరీ ఇల్లు, కార్యాలయం దగ్గర భద్రత పెంచారు.