మాస్కో నుంచి గోవా బయల్దేరిన విమానంలో బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అందులోని 236 మంది ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అయితే భారత వాయుసేన అత్యంత చాకచాక్యంగా వ్యవహరించింది. వేగంగా స్పందించి ప్రయాణీకులను సురక్షితంగా బయటపడేసింది. సమాచారం అందగానే… వాయుసేన రష్యన్ ఎంబసీ, భారతీయ అధికారులను అప్రమత్తం చేసింది. గుజరాత్ జామ్ నగర్ ఎయిర్పోర్ట్ లో భద్రతా ప్రొటోకాల్ ను యాక్టివేట్ చేసింది. దీంతో అక్కడ విమానయాన శాఖ నిర్వహించే ఎయిర్ పోర్టుల్లో మాస్కో-గోవా విమానాన్ని ల్యాండయ్యేలా చేశారు. అనంతరం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.