ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఆపరేషన్ గంగ కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 10వేలమంది స్వదేశానికి చేరారు. అయితే రష్యా బలగాల దాడుల్లో వణికిపోతున్న ఆదేశ తూర్పు ప్రాంతంలో వెయ్యి మంది భారతీయులు చిక్కుకుపోయారన్న తాజా వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఖుర్కివ్ లో 3వందలమంది, సుమీలో ఏడు వందల మంది ఇరుక్కుపోయారు. వారిని అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి అటునుంచి భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారికోసం ఎప్పటికప్పుడు రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్నామని విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్సి వెల్లడించారు. ఇక శుక్రవారం 14 విమానాల్లో 3772 మంది భారత్ చేరారు. శనివారం మరో 2 వేల 2 వందలమందిని సురక్షితంగా స్వదేశానికి చేర్చనున్నారు.