విదేశీ దండయాత్రికుల ఆక్రమణల వల్ల ఎన్నో పురాతన ఆలయాలు శిథిలమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా సెక్యులర్ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదు. వాటిని పునరుద్ధరించే బృహత్ కార్యానికి భారత ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను సోమవారం ఆయన అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని రోజంతా కాశీలోనే ఉన్నారు. ఇక కేవలం కాశీతోనే ఆపేయక ఇతర ప్రసిద్ధ ఆలయాలపైనా దృష్టిసారించనున్నారు.
ముఖ్యంగా పన్నెండు జ్యోతిర్లింగాలు మన నేల అంతర్లీన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యతను ప్రదర్శిస్తాయి. గుజరాత్ లోని జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ కూడా పునర్నిర్మించినదే.. పలుమార్లు విదేశీ దండయాత్రికుల చేతిలో శిధిలమైంది ఆలయం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేక శ్రద్ధతో సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులు కాశితో ఆగిపోవద్దని…దేశంలోని వేలాది ఆలయ పునరుద్ధరణ పనులపై దృష్టిపెట్టాలని దేశప్రజలు కోరుతున్నారు.