అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి యువతను బలగాల్లోకి తీసుకోవడంపై వివాదం నెలకొంది. బీహార్ లో అభ్యర్థులు రిక్రూట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు.
అక్కడ హింసాత్మక గుంపు అనేక రైళ్లను తగులబెట్టింది. ఈ ఘటనలపై స్పందిస్తూ కేంద్ర మంత్రి, భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ VK సింగ్ (R) యువకుల ఇటువంటి ప్రవర్తన సైన్యానికి తగినది కాదని పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి రాకముందే ఆర్మీ చీఫ్గా పదవీ విరమణ చేసిన కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్, అగ్నిపథ్కు సంబంధించి రిక్రూట్మెంట్ సమస్యపై బీహార్లోని నగరాల్లో హింసాత్మక నిరసనలను ఖండించారు.
“ఇలా అరుస్తున్న ఎవరైనా సైన్యానికి కూడా సరిపోతారని నేను అనుకోను. నేను రిక్రూట్మెంట్ కు నాయకత్వం వహిస్తే, నేను వారిలో ఎవరినీ తీసుకోను. సైన్యంలోకి రావాలనుకునేవారు ఇలా బిహేవ్ చేయరు” అని ఆయన అన్నారు.
"I don't think anyone who is shouting like this, is fit for the Army. If I was at the helm of affairs, I won't take any one of them; Let the scheme at least take to the ground…": Union Minister @Gen_VKSingh pic.twitter.com/1gg11wRnV6
— Rahul Kanwal (@rahulkanwal) June 16, 2022
హింసాత్మక ప్రదర్శనల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న సింగ్, వారి వెనక ఎవరో ఉండిఉండాలి అని అన్నారు. రక్షణ దళాల్లో 4 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తర్వాత రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్లలో ‘అగ్నివీర్’లకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంటూ యూపీ, హర్యానా ముఖ్యమంత్రులు ఈ పథకానికి మద్దతునిచ్చారని వీకే సింగ్ హైలైట్ చేసారు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, బీహార్ రాష్ట్రం కూడా అదే పని చేయాలని అన్నారు.