సన్సద్ టీవీగా ఆవిర్భవించిన ఆ రెండు టీవీ ఛానల్స్..!
https://twitter.com/ANI/status/1366601466723491842
ఇన్నాళ్లు.. వేరువేరుగా ఉన్న రాజ్యసభ టీవీ,లోక్సభ టీవీలను కలిపి.. సన్సద్ టీవీగా మార్చేశారు. దీంతో ఇకపై లోక్సభ,రాజ్యసభ ప్రసారాలు రెండు కూడా సన్సద్ టీవలోనే వీక్షించవచ్చు. ఈ సన్సద్ టీవీకి సీఈవోగా మాజీ ఐఏఎస్ అధికారి రవి కపూర్ను నియమించారు. ఆయన అసోం-మేఘాలయకు చెందిన 1986 ఐఏఎస్ క్యాడర్.అసోంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం శాఖల్లో కూడా కపూర్ జాయింట్ సెక్రటరీగా చేశారు. అంతేకాదు పెట్రోలియం మంత్రిత్వశాఖలోనూ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కపూర్ ఏడాదికాలం పాటు సన్సద్ టీవీకి సీఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
కాగా, రాజ్యసభ, లోక్సభ టీవీలను మర్జ్ చేసేందుకు గతేడాది నవంబర్లో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఓ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. అయితే ఇంతవరకూ రాజ్యసభ టీవీకి సీఈవోగా బాధ్యతల్లో ఉన్న మనోజ్ కుమార్ పాండేను తొలగించారు.