ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు పేరు మార్పు కొనసాగుతోంది. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన జగన్ సర్కారు..ఈసారి విజయనగరంలోని ప్రతిష్టాత్మక మహారాజా ఆస్పత్రి పేరును కూడా మార్చేసింది. ఆ పేరును తొలగించి… మహారాజా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రే ఆస్పత్రికి కొత్తబోర్డు పెట్టారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు కూడా వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఆ వివాదం ఇంకా సద్దుమణగకముందే ఆస్పత్రి పేరును మార్చిన జగన్ తీరుపై విపక్షం మండిపడుతోంది.