దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడిక కరోనా ప్రభావం చార్ ధామ్ యాత్రపైనా పడనుంది. మే
మే 14 న అక్షయ తృతీయ రోజున యమునోత్రి ధామ్, మే 15 నుంచి గంగోత్రి ధామ్, మే 17 నుంచి కేదార్నాధ్, మూడో కేదార్ తుంగ్నాధ్, 18 వ తేదీన బద్రీనాధ్ ఆలయాలు భక్తుల కోసం తెర్చుకోనున్నాయి. అయితే కరోనా ఉధృతి కారణంగా భక్తులు ఇప్పటికే చేసుకున్న బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు.
కేవలం వారం రోజుల వ్యవధిలో మూడు కోట్ల బుకింగ్స్లో 8 లక్షలు రద్దయ్యాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల బుకింగ్స్ ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి.
అటు కోవిడ్ ఉధృతి దృష్ట్యా చార్ ధామ్ యాత్రా విషయంలో అనుసరించాల్సి విధానాన్ని ప్రకటించాలి ఉత్తరాఖండ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. చార్ ధామ్ యాత్ర కుంభమేళాలా కావద్దని స్పష్టం చేసింది. యాత్రపై దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేసింది.