ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో జరగనున్నాయి. 27 ఏళ్ల తరువాత పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈఏడాది నవంబర్లో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లీ వెల్లడించారు. నెల రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 130 దేశాల నుంచి అభ్యర్థులు పాల్గొంటారు. 1996లో భారత్లో మిస్వరల్డ్ పోటీలు జరిగాయి…మళ్లీ ఇప్పుడు జరగనున్నాయి. ఇక ఇప్పటివరకు ఆరుసార్లు భారత్ మిస్ వాల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.