స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా యువతకు వివిధరంగాల్లో అవకాశాలు పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాను నిర్వహిస్తోంది కేంద్రప్రభుత్వం. ఈనెల9న దేశవ్యాప్తంగా242 జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. ఈ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని యువతకు నైపుణ్యాలు పెంచుకునే అవకాశాలు కల్పించనున్నాయి. తెలంగాణలో 6 జిల్లాల్లో, ఏపీలో 9 జిల్లాల్లో నిర్వహించనున్నారు.