ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటూ సందేశాత్మక సమాచారాన్ని షేర్ చేస్తూ… చురుగ్గా స్పందించే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి భారత ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. సరిహద్దుల్లో సైన్యం దగ్గరికెళ్లి మోదీ దీపావళి జరుపుకున్న నేపథ్యంలో ఆ వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశారాయన. ఫ్రంట్ లైన్ వారియర్లు పనిచేసే చోటకెళ్లి వాళ్లతో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరుచుకుని వారితో గడపడమే నాయకుడి లక్షణం అన్నారు ఆనంద్. ఆయన ట్వీట్ కు కొన్ని నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీపావళి సందర్భంగా.,.కార్గిల్ వెళ్లిన మోదీ అక్కడి సైనికులతో సంబరాలు జరుపుకున్నారు. సైనికులు తన కుటుంబసభ్యులని, దేశరక్షణ కోసం అహరహం శ్రమిస్తున్నవాళ్లతో పండగ చేసుకోవడం తనకు ఆనందంగా ఉందంటూ ఎమోషన్ అయ్యారు మోదీ. సైనికులతో కలిసి ఆడి పాడారు. ఈ సందర్భంగా వారు ఆలపించిన దేశభక్తి గీతాలు సోషల్మీడియాలోనూ వైరల్ అయ్యాయి. వారికి స్వయంగా మిఠాయి తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని.
Leadership—in any area of work—means staying connected to your ‘front line;’ giving them a sense of a personal link to their leaders… 👏🏽👏🏽👏🏽pic.twitter.com/Fe3gWrpKPR
— anand mahindra (@anandmahindra) October 25, 2022