దీదీతో ఢీ కొట్టే బీజేపీ నేత ఇతనే..!
వెస్ట్ బెంగాల్లో రాజకీయం మరింత హీటెక్కింది. ముఖ్యంగా దీదీ సర్కార్ను ఓడగొట్టి అధికారం చేపట్టాలని బీజేపీ పక్కా ప్లాన్ వేస్తోంది. ఈ నేపథ్యంలో దీదీ కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్ధుల ప్రకటనను కూడా టీఎంసీ ఖరారు చేసింది. అయితే ఈ సారి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గాన్ని వదిలి.. నందిగ్రామ్ నుంచి పోటీకి దిగుతున్నారు. దీంతో నందిగ్రామ్ స్థానం ప్రతిష్టాత్మం కానుంది. ఎందుకంటే.. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ కూడా దీదీకి పోటీ ఇచ్చే వ్యక్తిని అభ్యర్ధిగా నిలబెడుతోంది. ఆయన మరెవరో కాదు.. ఆ రాష్ట్ర మాజీ మంత్రి సువేందు. ఆయనకు నందిగ్రామ్లో మంచిపట్టు ఉంది. ఇటీవలే టీఎంసీతో విబేధించి బీజేపీలోకి చేరారు.
కాగా, భవానిపూర్ నుంచి ఈ సారి సవందీప్ ఛటోపాధ్యాయ బరిలో దిగుతున్నట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. 291 స్థానాలకు టీఎంసీ అభ్యర్థులను ప్రకటించగా వీరిలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది షెడ్యూల్డ్ కులాలు, 17 మంది షెడ్యూల్డ్ తెగల వారికి అవకాశం దక్కింది. అయితే మరో మూడు స్థానాల నుంచి అభ్యర్ధులను నిలబెట్టడం లేదు. ఇక మమతా బెనర్జీ ఈ నెల 11వతేదీన నామినేషన్ వేయనున్నారు. శివరాత్రి పర్వదినం నాడు వేయడం ద్వారా.. తనపై ఉన్న హిందూ వ్యతిరేకతను కాస్త తొలగించుకోవచ్చని ఇలా శివరాత్రి రోజు నామినేషన్ కార్యక్రమం చేపడుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.