అదానీపై హిండెన్ బర్గ్ వివాదాలు,అనంతర పరిణామాల నేపథ్యంలో విచారణకు నిపుణుల కమిటీని వేసింది భారత సుప్రీం కోర్టు. ఈ వ్యవహారంలో కేంద్రం సమర్పించిన నిపుణుల పేర్లను తిరస్కరించిన న్యాయస్థానం…విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే కమిటీకి నేతృత్వం వహిస్తారని తెలిపింది. మేం న్యూట్రల్ వ్యక్తుల్ని నియమిస్తాం అని ఆరుగురు పేర్లతో కమిటీని వేసింది. వాళ్లు. జస్టిస్ ఓపీ భట్, జస్టిస్ దేవదత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, బ్యాంకింగ్ దిగ్గజం కేవీ కామత్, సోమశేఖరన్ సుందరేశన్లు. ఒక్కసారి వాళ్ల బ్యాక్ గ్రౌండ్ చూద్దాం.
1. సోమశేఖర్, ముంబై లో కార్పొరేట్ లాయర్. ఈయన తరచుగా సోషల్ మీడియాలో యాంటీ బిజెపి ట్వీట్స్ పెడుతూ వుంటారు. ట్విట్టర్ ఈయన ఐడి బ్లాక్ చేసింది. అంతే కాదు ఈయన్ని సుప్రీం కొలిజియం ముంబై హై కౌర్ట్ జడ్జిగా సిఫార్సు చేస్తే మోడీ ప్రభుత్వం పై కారణంతో పెండింగ్ లో ఉంచింది.. అదొక్కటే కాదు. ఇతను అక్స్ ఫామ్ అనే NGO లో బోర్డు మెంబర్. ఈ NGO ఆదానికి వ్యతిరేకంగా ట్వీట్స్ పెడుతోంది. ఈ NGO కి జార్జ్ సోరోస్ నిధులు ఇస్తున్నాడు. ఈ NGO ఆర్ధిక అవకతవకలకు పాలు పడుతోంది అని డిసెంబర్ 2021లో దీని FERA లైసెన్స్ రద్దు చేసి, ఇన్కమ్ టాక్స్ హిడెన్ బర్గ్ ఇస్యూ రాక ముందే రైడ్స్ చేసింది. కేసు విచారణలో ఉంది. ఫ్రాడ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ NGO బోర్డు మెంబెర్ ఆడాని గ్రూప్ పై ఆరోపణలు విచారిస్తాడు. అంతే కాక ఈ అక్స్ ఫామ్ NGO ఆన్ లైన్ పిటిషన్ ద్వారా #ఆదాని కి వ్యతిరేకంగా సంతకాలు సేకరణ కూడా మొదలుపెట్టింది. సుప్రీం ఈయన్ని న్యూట్రల్ వ్యక్తిగా పేర్కొంటూ ఆ కమిటీలో వేసింది.
2. నందన్ నిలకేని. ఇతను ఇన్ఫోసిస్ కో ఫౌండర్. 2014 లో కాంగ్రెస్ టిక్కెట్ మీద ఎంపీగా బిజెపి అభ్యర్థి పై కర్ణాటక నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన భార్య ఒక NGO (అజిమ్ ప్రేమ్ జి IPSMF) ద్వారా మోడీ వ్యతిరేక వెబ్ పోర్టల్స్ ద వైర్, ద కేరవాన్, ద క్విన్ట్ కి నిధులు అందచేస్తోంది. గతంలో ఈమెను ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మీరు మెచ్చే దాతృత్వ సంస్థలు ఏవీ అని అడిగితే, ఆమె సోరోస్ ఆధ్వర్యంలోని ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని పొగుడుతూ చెప్పింది.
3. KV కామత్, ఇతను ICICI బాంక్ మాజీ చైర్మన్ . ఈయన ఈ మధ్య ఫ్రాడ్ కేసులో అరెస్ట్ బెయిల్ పై విడుదలైన ఐసీఐసీఐ బాంక్ సీఎండీ చందా కొచ్చర్ గురువు గారు.
4. O. P. భట్: ఇతను 2006-11మధ్య స్టేట్ బాంక్ చైర్మన్ గా పనిచేశాడు. ఈయన సమయంలోనే విజయ మాల్యాకు విచ్చలవిడిగా రుణాలు ఇచ్చారు అని సిబిఐ విచారణ చేస్తోంది. మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరానికి బాగా సన్నిహితుడుగా పేరు ఉంది. దీనిని సుప్రీంకోర్టు వారు న్యూట్రల్ కమిటీ గా నమ్మమంటారు.
మోడీని ఎన్నికల ద్వారా ఎదుర్కోలేం అని బ్రెజిల్ తరహాలో న్యాయ వ్యవస్థ ను ఉపయోగించి మోడీని అధికారానికి దూరం చేయడానికి విదేశీ సంస్థలు, ప్రతిపక్షాలు కలసి ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. 2014లోనే సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ కి తక్కువ సీట్లు అని అనుకోకండి. వాళ్ళు మీ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి న్యాయవ్యవస్థ ను ఉపయోగించుకుంటారూ అనీ.