స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టాలకు నాడు వంగదేశంగా చెప్పే బెంగాల్ వేదికైంది. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, అరవిందో, సుభాష్ చంద్రబోస్, ఖుదీరాంబోస్, సరోజినీ నాయుడు వంటి స్వాతంత్య్ర యోధులతో పాటు…వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి వాళ్లు బెంగాల్ గడ్డమీద పురుడుపోసుకున్నవాళ్లే. ఆ నేలనుంచి వచ్చిన సాహిత్యమే వాళ్లల్లో ఆ స్ఫూర్తిని నింపిందని చెప్పవచ్చు. మన జాతీయగీతం, గేయం జనగణమన, వందేమాతరం వచ్చిందీ అక్కడినుంచే కదా. రబీంద్ర సంగీత్ కు ఎంతో ఆదరణ అక్కడ. అయితే అలాంటి ఓ చక్కటి పాటను మీకు పరిచయం చేస్తున్నాం..దేశమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పసిప్రాయంలోనే ఉరికంబాన్ని ముద్దాడినవాడు ఖుదీరాంబోస్ ను తలుచుకుంటూ రాసిన పాట ఇది. ఎన్ని సార్లు విన్నా తెలియని ఉద్వేగానికి గురవుతాం. బ్రిటీష్ వాళ్లకు బందీ అయిన తరువాత ఉరితీసే ముందు ఆయన భరతమాతతో మాట్లాడుతున్నట్టు సాగుతుందీ పాట.
Ekbaar biday de ma ghure ashi
Hasi hasi porbo phnashi dekhbe bharatbasi
Koler boma toiri kore
Dnariye chhilam rastar dhare Ma go
Borolatke marte giye
Marlam aarek Englandbashi
Haate jodi thakto chhora
Tor Khudi ki porto dhora Ma go
Rokte-mangshe ek koritam
Dekhto jagatbashi
Shonibaar bela doshtar pore
Judgecourtete lok na dhore Ma go
Holo Abhiram-er dwip chalan Ma
Khudiram-er phnashi
Baro lokkho tetris koti
Roilo Ma tor beta beti Ma go
tader niye ghor koris Ma
Bouder koris dasi
Dosh mash dosh din pore
Jonmo nebo mashir ghore Ma go
Tokhon jodi na chinte paris
Dekhbi golay phnashi
అంటూ బెంగాల్లో సాగే పాటకు తెలుగులో అర్థం ఇదీ…
పల్లవి:
అమ్మా ఈ ఒక్క సారికి నన్ను పంపు.. తిరిగి ఇంటికి వచ్చేస్తాను కదా..
సాటి భారతీయులందరూ చూస్తుండగా నవ్వుతూ నీకోసం ఉరికంబం ఎక్కుతాను.. తిరిగి నీ ఒడికే చేరతాను…
చరణం-1:
చేతిలో బాంబు పట్టుకుని దేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక గవర్నర్ ని చంపాలని దారికాచాను, కానీ పొరపాటున మరో ఆంగ్లేయుడు చనిపోయాడు.
చరణం-2:
నేను భయపడి తెల్లదొరలకి దొరికిపోయాననుకుంటున్నావేమో. ఆ సమయంలో నా చేతిలో కత్తిలేదు.. ఉండి ఉంటేనా… నా రక్తంతో స్నానం చేసి ప్రపంచానికి చూపించేవాడిని పోరాటం ఎలా చేయాలో…
చరణం-3:
శనివారం జడ్జి కోర్టులో తీర్పు ఇస్తారు… నా స్నేహితుడు అభిరామ్ ని అండమాన్ ద్వీపానికి పంపుతారు… ఖుదీరామ్ కు ఉరి.
చరణం-4:
అమ్మా!!! నేను పోతే నువ్వు బెంగ పెట్టకోనక్కరలేదు.. నీకు 33 కోట్ల 12 లక్షల మంది పిల్లున్నారు… వారిని నీ చరణ దాసులుగా చేసుకో అందరూ నా కన్నా గొప్పగా నిన్ను సేవించగలవారే…
చరణం-5:
నేను లేనని చింతించవద్దు. సరిగ్గా పది నెలల పది రోజులకి మళ్ళీ తిరిగి వస్తాను. ఒక వేళ నన్ను గుర్తు పట్ట లేకపోతే నా మెడ మీద ఉరి తాడు గాటుని చూసి గుర్తు పట్టవచ్చు అందుకని ఏ మాత్రం దిగులు పడకుండా ఈ సారికి నన్ను ఇలా సాగనంపు …తల్లీ భరతమాతా నీకు వందనం..