25ఏళ్లుగా తనను కనిపెట్టుకున్న మావటి చనిపోతే ఆ ఏనుగు పడిన వేదన అంతాఇంతా కాదు..మావటి మృతదేహం సమీపం వరకు వెళ్లి తాను వచ్చానని ..బయటికివెళ్దాం రమ్మని ఎంతగానో పిలిచింది. ఇక తాను లేవలేడు, రాలేడని అర్థం చేసుకుని చాలాసేపు అక్కడే ఘీంకరిస్తూ నివాళి అర్పించింది. మావటిని చివరిచూపు చూసేందుకు వచ్చి అతన్ని పిలుస్తుండడం చూసి అక్కడివాళ్లు బోరున విలపించారు. 25ఏళ్లు పెనవేసుకున్న బంధం అలా విడిచివెళ్తే తట్టుకోవడం ఆ మూగజీవి వల్లాకాలేదు…చాలాసేపు అక్కడే ఉండి..తిరిగి వెళ్లిపోయింది..ఈ ఘటన కేరళలో జరిగింది