మొన్నటి వరకు టీఎంసీ పార్టీపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఎన్నికల నేపథ్యంలో చేశారని అనుకున్నారు అంతా. కానీ ప్రస్తుతం రెండో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అక్కడి టీఎంసీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును చూస్తే.. ఎంతటి దౌర్జన్యానికి పాల్పడుతారన్నది అర్ధమవుతోంది. దేబ్రా నియోజకవర్గంలో జరిగిన ఘటన చూస్తే.. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పాలన అద్దం పడుతోంది. నియోజకవర్గంలోని నౌపరా ప్రాంతంలో ఉన్న 22వ నంబర్ బూత్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీ నుంచి ఉన్న ఏజెంట్ చుట్టూ.. 150 మంది టీఎంసీ కార్యకర్తలు రౌండప్ చేసి.. బూత్లోకి ఎంటర్ కాకుండా అడ్డుకున్నారు. ఈ విషయాన్ని దేబ్రా నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి భారతీ ఘోష్ తెలిపారు. బీజేపీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ స్టేషన్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
https://twitter.com/ANI/status/1377456898161565699/photo/2