వెస్ట్ బెంగాల్లో మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌరా ప్రాంతానికి చెందిన ఓ టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం కలకలం రేపుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. హౌరా జిల్లాలోని ఉలుబెరియాలో ఉన్న టీఎంసీ నేత ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని.. దీనికి బాధ్యత వహించే అధికారులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈవీఎంల సీల్ను పరిశీలించిన అధికారులు.. వాటి ద్వారా ఎన్నికలు నిర్వహించబోమని.. ప్రస్తుతం ఈ ఈవీఎంలను ప్రత్యేక రూంలో భద్రపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడ్డవారిని అందర్నీ గుర్తిస్తామని.. వారిపై కఠిన చర్యలు తప్పవని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు.
కాగా, వెస్ట్ బెంగాల్లో అనేక చోట్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న కారణంగానే ఎనిమిది విడుతలగా పోలింగ్ నిర్వహిస్తుండగా.. అసోంలో మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఇవాళ ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి.
Sector Officer has been suspended. It was a reserved EVM that has been removed from the election process. Severe action will be taken against all involved: Election Commission of India (ECI)
EVMs and VVPATs were found at the residence of a TMC leader in Uluberia, West Bengal pic.twitter.com/IBFwmDSXeY
— ANI (@ANI) April 6, 2021