కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే కోట్ల మంది దీని బారినపడగా.. లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. అయితే ఎట్టకేలకు ఈ మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్ వచ్చినప్పటికీ.. ఇంకా కరోనా ఉదృతి కొనసాగుతోంది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ఓ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవ్వడం టెన్షన్కు గురిచేసిన సంగతి మరువకముందే.. తాజాగా రెండో డోసు తీసుకున్న ఓ వైద్యుడికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రాజధాని షిమ్లాలో దీన్దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోన్న ఓ వైద్యుడు ఇటీవలే రెండో డోసు తీసుకున్నారు. అయితే తాజాగా ఆయనకు కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. ఆయనతో పాటుగా.. ఆయన భార్య, కూతురుకు కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. వైద్యుడు రెండో డోసు తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ సోకడంతో అక్కడి సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.
కాగా, వైద్యుడు మార్చి 1వ తేదీన కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి డోసు జనవరి 30వ తేదీన తీసుకున్నారు. అయితే రెండో డోసు తీసుకున్న తర్వాత.. 15 రోజుల అనంతరం వ్యాక్సిన్ ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.