
Sohil Hussain Mor, advocate from Rajkot
హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వీరంగం చేసిన గుజరాత్ రాజ్ కోట్ కు చెందిన న్యాయవాది సోహిల్ హుస్సేన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శివాజీ జయంతి సందర్భంగా హిందువులు నిర్వహించిన శోభాయాత్రలో పిచ్చెక్కినట్టు ప్రవర్తించాడు సదరు లాయర్. అంతే కాదు హిందువులంతా భారత్ వదిలి వెళ్లాలి..దేశం ఇప్పుడు పాకిస్తాన్ లా మారిపోయిందంటూ…పెద్దపెట్టున అరుస్తూ గణేశ్ విగ్రహాలు సహా ఇతర హిందూ దేవీదేవుళ్ల ఫొటో ఫ్రేమ్ లను పగులకొట్టాడు. అడ్డుకోబోయిన పోలీసులపైనా దాడి చేశాడు. దీంతో మతపరమైన మనోభావాలు దెబ్బతీశారని…పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలపై వేర్వేరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.
అంతే కాదు తానుండే మోర్ రెసిడెన్షియల్ సొసైటీ వాట్సప్ గ్రూపులోనూ ఛత్రపతి శివాజీ మహరాజ్ పై అవమానకరమైన వ్యాఖ్యను పోస్టు చేసినట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్రూపు సభ్యుడైన జ్యోతి సోదా అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ దేశం ఇప్పుడు పాకిస్తాన్ గా మారింది. మీరంతా దేశం విడిచి వెళ్లండి అంటూ బెదిరించిన రికార్డులూ ఉన్నాయి.
ఓ మహిళతో వాదిస్తూ ఇదిప్పుడు పాకిస్తాన్ గా మారింది. ఇక్కడంతా ముస్లింలే. హిందువులంతా వెళ్లిపోవాలి అన్న వీడియో కూడా వైరల్ అవుతోంది. మేమెందుకు వెళ్లాలి అని ఆ మహిళ నిలదీస్తే రెట్టిస్తూ ఇప్పుడే వెళ్లిపో అని అరిచాడు ఆ లాయర్.
રાજકોટમાં ધાર્મિક લાગણી દૂભાઈ તેવી શિવાજી મહારાજ વિરોધી ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો.સોહિલ મોર નામના વ્યકિતએ પોસ્ટ મુકી હતી,શિવાજી મહારાજની જયંતિને લઇ મુકી હતી પોસ્ટ pic.twitter.com/BMBBDvvjNH
— News18Gujarati (@News18Guj) February 22, 2022
సోహల్ ఈ తీరుతో సొసైటీవాసులు అవాక్కయ్యారు. ఇన్నేళ్లు తమతో కలిసి బాగానే ఉండేవాడని…కొంతకాలంగా ఉగ్రవాదులు మాట్లాడే భాష మాట్లాడుతున్నారని అంటున్నారు. చదువు, సరైన జ్ఞానం లేనివాళ్లు ఇలా మాట్లాడితే ఏమో అనుకోవచ్చు కానీ…వృత్తిరీత్యా న్యాయవాది అయి ఉండి అలా మాట్లాడడం తమను భయపెడుతోందని వారంటున్నారు. తాము కొలిచే దేవుళ్ల ఫొటో ఫ్రేములను, గణేశుడి విగ్రహాలను పగలకొట్టాడని…అతని వెనక విద్రహశక్తులేవన్నా ఉండవచ్చని అనుమానిస్తూ పోలీసుల ఎదుట వాళ్లు వాపోయారు.
విగ్రహాలు ఎందుకు పగలగొట్టావని ఓ మహిళ నిలదీయబోతే ఆమెపై హత్యాయత్నం చేయబోయాడు హుస్సేన్. అప్పటికే అక్కడికి వచ్చిన పోలీసులు అడ్డుకోబోగా… వాళ్లమీదకూ వెళ్లి దుర్భాషాలాడాడు. దీంతో కానిస్టేబుల్ దంగర్ మోర్ కూడా ఉన్నతాధికారులను ఫిర్యాదు చేశాడు. అంతేకాదు కర్నాటక హిజాబ్ ఉద్యమానికి తన మద్దతు అంటూ పోస్టు చేశాడు హుస్సేన్.