ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల నిలిచిపోయిన అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. హఠాత్తుగా వచ్చిన వరదలతో పలువురు చనిపోయిన సంగతి తెలిసిందే. మరికొందరు భక్తులు గల్లంతయ్యారు. అయితే పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడంతో తిరిగి యాత్రను పునరుద్ధరించారు. జమ్ములోని యాత్రి నివాస్ నుంచి 4వేలకు పైగా భక్తులు 110 బస్సుల్లో అమర్నాథ్ కు బయల్దేరారు . ప్రమాదం జరిగిన ప్రాంతం యాత్రికుల బసకు అనుకూలమైనది కాదన్ని ప్రచారాన్ని అధికారులు ఖండించారు అప్పుడప్పుడు మెరుపు వరదలు వస్తుంటాయన్నారు.