ముహమ్మద్ ప్రవక్త దూషించిందన్న ఆరోపణలపై బీజేపీ అధికారప్రతినిధి నూపుర్ శర్మపై హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ సమాచారాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు.
“ప్రవక్త మహమ్మద్ను అవమానించిన బీజేపీ అధికార ప్రతినిధిపై హైదరాబాద్లో సైబర్ క్రైమ్ PS కింద ఎఫ్ఐఆర్ నమోదైంది” అని ట్వీట్ చేశారు.
https://twitter.com/asadowaisi/status/1531625971484196865?s=20&t=XGRoulXLJfwV0wb63gdklQ
హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, సీనియర్ ఇన్స్పెక్టర్ అయిన పి.రవీందర్ ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 153 (ఎ), 504, 505 (2) సహా 506 కింద సైబర్ క్రైమ్ PSలో మే 30వ తేదీన నమోదు చేశారు.
“టైమ్స్ నౌ న్యూస్ ఛానెల్లో మే 27న నావికా కుమార్ హోస్ట్ చేసిన టీవీ చర్చలో నూపుర్ శర్మ ఇస్లాం మతాన్ని ద్వేషపూరితంగా అవమానించింది. ప్రవక్తకు వ్యతిరేకంగా దుర్భాషలాడింది, ప్రవక్తను అవమానించడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే. ” అని పి రవీందర్ తన ఫిర్యాదులోపేర్కొన్నారు.
“పవిత్ర ఖురాన్లో పేర్కొన్న మత విశ్వాసాలను అవమానించడం ద్వారా.. ముహమ్మద్ ప్రవక్త 6 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారని.. 9 సంవత్సరాల వయస్సులో ఆమెతో లైంగిక సంబంధం కలిగి ఉన్నారని పేర్కొనడం ద్వారా ఆమె ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని కూడా సృష్టించింది. ముస్లింలందరూ ఎంతో ఆదరించే ముహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ ద్వేషపూరిత మాటలు పలికింది.
ముస్లింలు ఆయనపై ఎలాంటి అవమానాన్ని భరించలేరు. ఇది ఒక సంఘంగా ముస్లింలందరినీ ఆగ్రహానికి గురి చేసింది. అంతేకాకుండా, ఆమె ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య అసమ్మతి, శత్రుత్వం, ద్వేషం వంటి భావాలను సృష్టించే ఉద్దేశ్యంతో ఇస్లాం విశ్వాసాలు, సిద్ధాంతాలను లక్ష్యంగా చేసుకుంది” అని పి రవీందర్ అన్నారు.
నుపుర్ శర్మను బెదిరించినందుకు AIMIM (ఇంక్విలాబ్) అబ్బాసీపై దాఖలైన మరో ఎఫ్ఐఆర్ను ఒవైసీ షేర్ చేశారు.
ముఖ్యంగా ఒవైసీ, అబ్బాసీ ప్రస్తుత పార్టీ పేరును పేర్కొనకుండా “మాజీ బీజేపీ నాయకుడు” అని వ్రాసాడు, 2018లోనే అబ్బాసీ బీజేపీని వీడారు. శర్మపై ఆయన పార్టీ కోటి రూపాయల నజరానా ప్రకటించింది. అబ్బాసీ పై కూడా సైబర్ క్రైమ్ పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.