భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సాక్షిగా అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కొట్టుకున్నంత పనిచేశారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాచలంలో గెలవబోయేది తామేనంటూ ప్రసంగం మొదలు పెట్టారు. దీంతో పక్కనే ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ ప్రచారం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరిమధ్యా వాగ్వాదం జరిగింది.ఇరువర్గాల నినాదాలతో సమావేశ మందిరం హోరెత్తింది. అధికారులు ఇద్దరికీ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
Watch Video :