భద్రతా ఉల్లంఘన వ్యవహారంపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జోడో యాత్రలో భద్రతపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నానంటూ తనపై కేసులు పెట్టాయని చూస్తున్నారని ఆరోపించారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్లాలని హోం శాఖ చెబుతోందని, అలా ఎలా చేయగలనని ప్రశ్నించారు. యాత్రలో తాను ధరించిన టీషర్టుపై బీజేపీ విమర్శలపైనా రాహుల్ స్పందించారు. తనకు చలి అంటే భయం లేదని..అందుకే స్వెట్టర్ వేసుకోలేదనీ అన్నారు.