లిక్కర్ పైసలు పంచుకునేందుకు ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణ వచ్చి కేసీఆర్ ను కలిశారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. దేశంపై సీఎం కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారని…నిన్నటి ఖమ్మం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కూడా వదులుకున్న వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో బోర్ల సంఖ్య 18 లక్షల నుంచి 24 లక్షలకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఏ గ్రామానికైనా ఇస్తున్నారా?.. విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సంజయ్ రైతులకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారని బండి సంజయ్ విమర్శించారు.