అసెంబ్లీ లో బీజేపీకి చాంబర్ కేటాయించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతూ… అసెంబ్లీలో టిఫిన్ చేయడానికి కూడా తమకు రూం లేదన్నారు. చాంబర్ కూడా కేటాయించకపోవడం అంటే ఎమ్మెల్యేలను అవమానించడమేనన్నారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యులం ముగ్గురం ఉన్నా… ఆఫీస్ లేదని…యూరిన్ వెళ్లేందుకు కూడా అవకాశం లేదని..ఇంత అవమానమా అని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల. బీజేపీ సభ్యులను బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్కు కూడా పిలవడం లేదని… గతంలో సీపీఐ, సీపీఎం, ఒక్కొక్క సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీకి పిలిచారని గుర్తు చేశారు.అయితే ఈటల మాట్లాడుతుండగానే మధ్యలో కల్పించుకున్న మంత్రి హరీశ్ రావు… తమకు నిబంధనలు తెలుసని… ఐదుగురు సభ్యులు ఉంటేనే ఛాంబర్ ఇవ్వాలని గుర్తుచేశారు.బడ్జెట్పై చర్చ జరుగుతున్న సమయంలో బడ్జెట్ పరిమితికి లోబడి, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. బడ్జెట్పై విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని సభను కోరారు. అయితే ఏదనా సమస్య ఉంటే చాంబర్ కు వచ్చి మాట్లాడాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈటలకు సూచించారు.దీంతో ఈటల బడ్జెట్ పై తన ప్రసంగాన్ని కొనసాగించారు.