ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు విచక్షణ కోల్పోతున్నారు. రాజస్థాన్ కు చెందిన ఓ మంత్రి దిగజారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తన నియోజకవర్గంలోని రోడ్ల గురించి ప్రస్తావిస్తూ కత్రినాకైఫ్ చెంపల్లా ఉండాలని అధికారులతో అన్న వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజేంద్ర సింగ్ గుదా…. ఉదయపూర్వతి నుంచి ఎన్నికయ్యారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఆయనకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. అదే వేదికనుంచి అధికారులను ఆదేశిస్తూ ఇక పై రోడ్లు కత్రినాకైఫ్ బుగ్గల్లా ఉండాలని అనడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
అసలైతే ముందు సదరు మంత్రి రోడ్లు హేమామాలిని బుగ్గల్లా రోడ్లు ఉండాలని మంత్రి అన్నారు. వెంటనే లేదు లేదు హేమామాలిని వయసు పెరిగింది అంటూ…ఈ రోజుల్లో సినిమాల్లో ఫేమస్ నటి ఎవరు అని ప్రశ్నించారు. అక్కడున్న వారు కైత్రినా కైఫ్ పేరు చెప్పడంతో..అయితే నా ఊరి రోడ్లు కత్రినా చెంపల్లా మెరవాలి అని అన్నారు.
2005లో బిహార్ మాజీ సీఎం ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తనను గెలిపిస్తే బిహార్ రోడ్లు హేమామాలిని చెంపల్లా నున్నగా మారిపోతాయన్నారు. ఇక 2019లో కాంగ్రెస్ నాయకుడు పీసీ శర్మ కూడా ….బీజేపీ నాయకుడు కైలాస్ విజయ్ వర్గియాలా ఉన్న రోడ్లను కాంగ్రెస్ ప్రభుత్వం హేమామాలిని చెంపల్లా తీర్చిదిద్దుతుందని అన్నారు.