2020 లో జరిగిన ఢిల్లీ అల్లర్లు విధ్వంసం పై ఢిల్లీలోని కర్కర్దూమా సెషన్స్ కోర్టు విచారణ జరుపుతోంది.
“ఖూన్ తో బహనా పడేగా” ఆని ఉమర్ ఖలీద్, సఫూరా జర్గర్, యోగేంద్ర యాదవ్ సహా ఇతరులు ఢిల్లీలో హింస, హత్యలను ఎలా ప్లాన్ చేశారు అని వాట్స్ ఆప్ చాట్స్, CCTV ఫ్యూటేజి సాక్ష్యాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలను వినిపించారు.
2020 ఢిల్లీ అల్లర్లు ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీ, షార్జీల్ ఇమామ్, సఫూరా జర్గర్, దేవాంగనా కలితా, నటాషా బధ్వర్ సహా ఇతరులతో కలిసి పన్నిన ముందస్తు ప్రణాళిక అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కర్కర్దూమా జిల్లా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ ముందు తన నాలుగు గంటల వాదనల సందర్భంగా వాట్సాప్ చాట్లను సమర్పించారు, ఉమర్ ఖలీద్ జనవరి 23న తన సమావేశంలో “రక్తం చిందాలి” అని ప్రస్తావించారని పేర్కొన్నారు. దీనికి జతగా ప్రాసిక్యూటర్ సాక్షి వాంగ్మూలాన్ని కూడా ప్రస్తావించారు.
2020 జనవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్ల ముందస్తు ప్రణాళికలో ఖలీద్ కీలక పాత్ర పోషించాడని పిపి పేర్కొన్నాడు.
బిజెపి నాయకుడు కపిల్ మిశ్రాను నిందిస్తూ అతని వల్లే హింస జరిగింది అనే వాదనను ఖండిస్తూ ఫిబ్రవరి 17న కపిల్ మిశ్రా చేసిన ప్రేరేపణ ప్రకటనకు ముందే సఫూరా & షర్జీల్తో సహా 5 మంది సభ్యులకు గ్రూప్ చాట్లు జరగబోయే హింస గురించి వారికి ముందే తెలుసని ప్రాసిక్యూటర్ కోర్టుకు చెప్పారు.
పిపి కథనం ప్రకారం అసలు ఇదంతా ఎక్కడ నుంచి మొదలైంది?
JNU మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ మరియు స్థానిక ముస్లిం నాయకుడు అబ్దుల్ ఖలీద్ నేతృత్వంలోని ‘యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్’ గ్రూప్ నిర్వహించిన డిసెంబర్ 7వ తేదీన జంతర్ మంతర్ వద్ద CAA వ్యతిరేక నిరసనకు ఇమామ్ హాజరయ్యారు, వీరిద్దరూ ప్రస్తుతం నిందితులుగా జైలులో ఉన్నారు. ఢిల్లీ పోలీస్ క్రిమినల్ బ్రాంచ్ దర్యాప్తు ప్రకారం, CAA వ్యతిరేక ఉద్యమం సహజమైనది కాదు. మొత్తం ప్రచారాన్ని కొంతమంది ప్రత్యేకించి నిర్వహించారు.
షర్జీల్ ఇమామ్ తనతో పాటు జంతర్ మంతర్ వద్దకు వెళ్లడానికి ముస్లిం JNU విద్యార్థులను ఏకం చేశాడు. అదే రోజు, అతను వార్సీతో సంభాషణలో JNU, జామియా, AMU తోపాటు DU నుండి విద్యార్థులను సమీకరించడానికి తన వ్యూహాన్ని వెల్లడించాడు. ఈ నిరసనలో ఉమర్ ఖలీద్ యోగేంద్ర యాదవ్ను షార్జీల్ ఇమామ్కు పరిచయం చేశారు. కార్యాచరణ ప్రణాళిక గురించి వ్యూహరచన కొనసాగించడానికి మరుసటి రోజు జంగ్పురాలో సమావేశం కావాలని కూడా వారు అంగీకరించారు. డిసెంబర్ 8న ఈ సమావేశం జరిగింది.
వాట్సాప్ గ్రూప్ నుండి యోగేంద్ర యాదవ్ చేసిన సందేశం కూడా ISI (ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్)లో సమావేశం జరిగిందని సూచించే విధంగా చూపబడింది, మీటింగ్కు అందరూ హాజరయ్యారని ట్రాక్ చేయడానికి హాజరు షీట్ కూడా ఉంది.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ తన రోజు వాదనలో జనవరి 15-16 తేదీల్లో ‘చాంద్ బాగ్’లో జరిగిన సమావేశాన్ని ప్రస్తావించారు. నిందితులు CrPC (మేజిస్ట్రేట్ ముందు) సెక్షన్ 164 కింద ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయని చెప్పారు. వాటిల్లో ‘దండే, పత్తర్, లాల్ మిర్చ్, తేజాబ్ ఇక్కట్టియ్ కియే గ్ ఆయే’ (చెరకు, ఎర్ర మిరపకాయ, యాసిడ్ మరియు రాళ్లు సేకరించబడ్డాయి అనిపేర్కొన్నారు).
ఒవైస్ అనే వ్యక్తి ప్రణాళికా బద్ధంగా జరుగుతున్న హింసకు సంబంధించిన సమస్య గురించి మాట్లాడాడు. “బాధ్యతా రహితమైన ప్రవర్తన” ఉందని, స్థానిక ప్రజలను బస్సు కింద పడవేస్తున్నారని అతను ఈ హింసకు వ్యతిరేకంగా చెప్పాడు అని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. “హింస నహీ కర్నే దేంగయ్ తుమ్హేన్ ఔర్ తుమ్హారే దోస్తోన్ కో” అని ఒవైస్ పేర్కొన్నారు. “ఈ “తుమ్హీన్” “తుమ్హారే దోస్త్” ఎవరు ? అరెస్టయిన వ్యక్తులు చాంద్ బాగ్ సమావేశానికి హాజరైన తుమ్హీన్ & తుమ్హారే దోస్త్” అని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.
పోలీసులపై దాడి చేసేందుకు ప్రజలు ఎర్రకారం పొడిని నిరసనకారులకు ఎందుకు అప్పగించారని ఓవైస్ సభ్యుల్లో ఒకరిని అడిగారని ప్రాసిక్యూటర్ తెలిపారు.
అదే రోజు అంటే డిసెంబర్ 15వ తేదీన జామియా సమీపంలో రెండు హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. పోలీసులపై దాడి చేయడానికి నిరసనకారులు పెట్రోల్ బాంబులు, రాడ్ల తోపాటు కర్రలను ఉపయోగించిన హింసాకాండలో, మూడు DTC బస్సులు దగ్ధమయ్యాయి, మూడు మోటార్సైకిళ్లు, ఒక పోలీసు వాహనం, ఇతర ప్రజా ఆస్తులు కాకుండా మరో ఎనిమిది ధ్వంసమయ్యారు. మొత్తం 45 మంది పోలీసులు గాయపడ్డారు.
రాబర్ట్ అనే సాక్షి మేజిస్ట్రేట్ ముందు, “ నిరసన కే లియే కుచ్ పైసా జామియా సే ఆతా థా, కుచ్ ఆతంకవాది దేతే ది” . ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన నిధులు అని ప్రాసిక్యూటర్ కూడా పేర్కొన్నారు. తాహిర్ హుస్సేన్ డబ్బును తెలుపు నుండి నల్లగా మార్చినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇది చాలా అసాధారణమైన విషయం, ప్రాసిక్యూటర్ తన వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. “డబ్బును నల్లగా మార్చడం ఎందుకు అవసరం? ఈ డబ్బు సైట్లకు వెళ్లింది” అని కోర్టు ముందు పేర్కొంది.
వాట్సాప్ చాట్లను ఉటంకిస్తూ ప్రాసిక్యూటర్, హింసను కొనసాగించడానికి ‘నిరసన’ నిర్వాహకుల ఆదేశంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం సమీకరణ జరిగిందని, వివిధ సాక్షులు సెక్షన్ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలాల ద్వారా మాత్రమే కాకుండా CCTV ఫుటేజీ ద్వారా కూడా రుజువు చేయబడింది. చాంద్ బాగ్ ఏరియా దారులలో భారీగా జన సమీకరణ, ఛార్జిషీట్లో పొందుపరిచిన సీసీటీవీ ఫుటేజీలు, అనుబంధ చార్జ్షీట్లు ముందస్తుగా ఆలోచించి పెద్ద ఎత్తున జన సమీకరణను సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఒక న్యాయవాది, మిస్టర్ అనాస్ తన్వీర్ ఒవైస్తో ఏకీభవించి. “మీరు మా సమాధులను ఎందుకు తవ్వుతున్నారు” అని వీరిని ప్రశ్నించినట్లు కూడా పిపీ కోర్టుకు తెలిపాడు.
మరొక వ్యక్తి వాట్సాప్ చాట్లో “యే లడాయి హిందుస్తాన్ కి లడాయి సే ముసల్మానో కి లడాయి క్యు బంతి జా రహీ హై?” అని అడిగాడు. రాహుల్ రాయ్ వచ్చి దీనిని “వ్యూహంలో మార్పు” అని పిలిచాడు అని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కోర్టులో చూపిన ఒక వ్యక్తి వాంగ్మూలం “లేడీస్, జెన్స్ కు లాఠీలు, రాళ్ళు, కంకర మొదలైనవి అప్పగించబడ్డాయి” అని చెప్పాడు.
ప్రాసిక్యూటర్ సాక్షి ద్వారా ఒక వాంగ్మూలాన్ని చదివాడు, ఒక సమావేశంలో ఉమర్ ఖలీద్ గుల్తో “ సర్కార్ ముసల్మానో కే ఖిలాఫ్ హై, భాషన్ సే కామ్ నహీ చలేగా, ఖూన్ బహనా పడేగా” (ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకం, ప్రసంగాల ఉపయోగం లేదు, రక్తం చిందించవలసి ఉంటుంది). ఒక వాట్స్ ఆప్ సమూహంలో, “ఆగ్ లాగ్వానే కి పూరీ తయ్యారీ హై ” (మేము మంటలను వెలిగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాము ) అనే సందేశం ఉంది.
“నిరసనలలో” స్థానిక మహిళలు ఎవరూ పాల్గొనలేదు అని ప్రాసిక్యూటర్ చెప్పారు. మహిళలను సమీకరించారు అని వాట్సాప్ చాట్లు చాలా చెబుతున్నాయని ఆయన చెప్పారు. దేవాంగన కలిత, సఫూరా జర్గర్ తదితరులు జనాలను సమీకరించారు. నిరసన “అకస్మాత్తుగా” వచ్చింది కాదు. బాగా ఆలోచించి హింస ముందస్తుగా ప్రణాళిక చేయబడింది అని పీపీ కోర్టుకు తెలిపారు.
10 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పిన ఒక సాక్షి , 250 మంది మహిళలు & పిల్లలను జంతర్ మంతర్కు వెళ్లేందుకు సమీకరించాము అని చెప్పాడు. జహంగీర్పురిలో చాలా మంది బంగ్లాదేశ్లు ఉన్నారని & వారికి CAA/NRC గురించి ‘విద్యావంతులను’ చేయాలని మరియు వారిని నిరసన ప్రదేశంలో గుమిగూడాలని చెప్పామని ఉమర్ ఖలీద్ని అక్కడ కలిశానని సాక్షి చెప్పాడు.
ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన పెద్ద కుట్రలో జాన్వీ, నటాషా, ఉమర్ ఖలీద్ మరియు తబ్రేజ్ ప్రమేయం ఉందని మేజిస్ట్రేట్ ముందు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం నిర్ధారిస్తుంది. “బురఖా ధరించిన” మహిళలు సమీకరించబడ్డారు & ‘పింజా టోడ్’ సభ్యులు సమీకరించబడ్డారు, నిర్దిష్ట స్థలంలో స్థానికులు ఎవరూ లేరని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం పేర్కొంది.
హింసకు వ్యతిరేకంగా నిలబడ్డ ఒంటరి వ్యక్తి ఓవైస్ “పింజ్రా తోడ్ కి మాబ్ మెంటాలిటీ కి వాజా సే, లోగోన్ కి జాన్ ఖత్రే మే హై. హుమరే ఘర్ జల్నే కే బాద్ ఆప్ సంఘీభావ్ సమావేశ్ ఔర్ రిలీఫ్ వర్క్ కర్లేంగే,” అని చెప్పి చివరకు DPSG గ్రూప్ నుండి అతను నిష్క్రమించాడు అని ప్రాసిక్యూటర్ చెప్పి 24.02.20న చాంద్ బాగ్ ప్రాంతంలో సమీకరణకు సంబంధించిన CCTV ఫుటేజీని ప్లే చేశారు.
వీరు ‘శాంతియుత నిరసన’ కోసం
ప్రణాళికాబద్ధమైన సమీకరణ జరిగిందని, ప్రజలు లాఠీలు మోస్తున్నారని సూచించడానికి ప్రాసిక్యూటర్ CCTV ఫుటేజీ యొక్క మరిన్ని వీడియోలను కోర్టుకు చూపారు. ప్రాసిక్యూషన్ “సమయాన్ని గమనించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇది మధ్యాహ్నం 12.02 – 12.09 మధ్య. ఈ వీడియోలలో చాలా మంది పురుషులు మరియు మహిళలు దండాలు మరియు ఝాండాలను కలిగి ఉన్నారు”
ఒక వ్యక్తి బిలాల్ స్క్రీన్షాట్లో వాట్సాప్ గ్రూప్లో ఈ వార్తను పంచుకోవడం కనిపిస్తుంది. “అప్రధి”లందరికీ తెలుసు, “కుచ్ భీ హోజాయే, పోలీస్ వాలా నహీ మర్నా చాహియా” & ఈ వార్త గేమ్ ఛేంజర్ అని ప్రాసిక్యూటర్ విన్నప్పుడు చెప్పారు.
సాయంత్రం 4.44 గంటలకు, ఢిల్లీ జఫ్రాబాద్ మౌజ్పూర్ హింసాత్మక వార్తల తర్వాత, హింసాకాండ తర్వాత కానిస్టేబుల్ చనిపోయాడని సూచిస్తూ, ఉమర్ ఖలీద్ ఈ ఆందోళన స్తలం యొక్క “ఇన్చార్జ్” అయిన నటాషా నర్వాల్కి కాల్ చేశాడు. ఇది సాయంత్రం 5.02 గంటలకు పన్నెండు నిమిషాల కాల్ మాట్లాడారు. అప్పుడు అల్లర్లు, బాంబు పేలుళ్లు జరిగినప్పుడు, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఫోన్ చేసుకున్నారు. ఫోన్ రికార్డ్ల ప్రకారం ఏప్రిల్ 18 మరియు 19వ తేదీ వారి ఫోన్ల నుండి డేటా తొలగించబడింది.
“మీరు మీ జాడలను తుడిచిపెట్టారు అంటే మీకు స్పష్టంగా దాచడానికి ఏదైనా ఉంది అనే అనుమానం తోనే దేవాంగన కలిత, ఉమర్ ఖలీద్ ఇతరుల ఫోన్ల నుండి డేటా తుడిచిపెట్టుకుపోయిందని ప్రాసిక్యూటర్ చెప్పారు. ”
ఉమర్ ఖలీద్కు ఢిల్లీ పోలీసు అధికారి పంపిన సందేశం కూడా కోర్టులో చూపబడింది. ఆ అధికారి జాగ్రత్తగనే ఉంటాడని, హింస యొక్క మూలం గురించి పూర్తిగా తెలుసునని, ట్రంప్ పర్యటన సమయంలో నిరసనను విరమించమని అందుకే ఖలీద్కు సందేశం పంపడం గమనించాల్సిన విషయం అని కోర్టుకు పీపీ తెలిపాడు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నిస్సహాయతను వ్యక్తం చేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిందితులు సూచించిన సందేశాన్ని కూడా ప్రాసిక్యూటర్ చూపించారు.
వారు హింసకు పాల్పడడాన్ని దాచడానికి వారు బహుళ కౌంటర్ కథనాలను సృష్టించారు. కపిల్ మిశ్రా కథనం, పోలీసు నిష్క్రియాత్మక కథనం మరియు భీమ్ ఆర్మీ కథనం వారిపై నింద పడకుండా చేయడానికి బ్యాకప్ ప్లాన్. ముందుగా వారు పోలీసు నిష్క్రియాత్మకత ఉందని చెప్పారు, రోడ్లను బ్లాక్ చేస్తూ వ్యవస్థను స్తంభింపజేస్తారు, పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని మాకు అంబులెన్స్లు కావాలి అని కథనాలు అల్లారు. మరోవైపు “పోలీసు నిష్క్రియ”పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. అంటే అక్కడ పోలీసులు లేకుంటే లాఠీచార్జి చేసింది ఎవరు? రెండు ప్రకటనలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అని ప్రాసిక్యూటర్ చెప్పారు.
తదుపరి వారం విచారణలు కొనసాగుతాయి.
ప్రాసిక్యూషన్ తరఫు వాదనలు విన్న కోర్టు 7వ తేదీన ఉమర్ ఖలీద్, 9వ తేదీన ఖలీద్ సైఫీ, 9వ తేదీన షాదాబ్ వాదనలు వింటుంది..
Courtesy :- Chada Shastry