“డిజిటల్ చెల్లింపుల” పై చార్జీలు వేసే యోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అని మీడియాలోనూ సోషల్ మీడియాలో నూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశమేలేదంది.
UPI పేమెంట్ వ్యవస్థ ( అంటే ఈ G పే, పే టీఎం, ఫోన్ పే వంటివి) అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం కలుగ చేస్తున్నవి. అలాగే ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ఉపయోగకరమైన డిజిటల్ వ్యవస్థ ఇది. అందువల్ల ఇటువంటి UPI సేవలకు ఎలాంటి ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదు. వీటిని నడపడంలో అయ్యే తమ ఖర్చులు గురించి సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలి.
దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గత సంవత్సరం #DigitalPayment వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించింది . #DigitalPayment చెల్లింపు ప్లాట్ఫారమ్లను ఆర్థికంగా, వినియోగదారు-స్నేహపూర్వకంగా ఉండేలా ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఆర్ధిక సహాయం ప్రకటించింది అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
The Govt had provided financial support for #DigitalPayment ecosystem last year and has announced the same this year as well to encourage further adoption of #DigitalPayments and promotion of payment platforms that are economical and user-friendly. (2/2)
— Ministry of Finance (@FinMinIndia) August 21, 2022