కర్ణాటకలో రాబోయే రాజ్యసభ ఎన్నికలలోగానీ లేదా అసెంబ్లీ ఎన్నికలలోగానీ తమ పార్టీ, జేడీ(ఎస్) మధ్య ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నుంచి నాల్గవ రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవడానికి మూడు పార్టీలలో దేనికీ తగిన సంఖ్యలో ఓట్లు లేనందున ఆయన ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. తాను జాతీయ రాజకీయాలకు వెళ్లనని.. రాష్ట్రంలో క్రియాశీలంగా ఉంటానని కూడా స్పష్టం చేశారు.
జూన్ 10న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.. నిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక మంత్రి), బిజెపికి చెందిన కేసీ రామమూర్తి, జైరాం రమేష్ సహా కాంగ్రెస్కు చెందిన దివంగత ఆస్కార్ ఫెర్నాండెజ్ ల పదవీకాలం జూన్ 30తో ముగియనుంది.
నామినేషన్ల దాఖలుకు మే 31 చివరి తేదీ. ప్రస్తుత శాసనసభలో పార్టీ స్థానం ఆధారంగా బీజేపీ రెండు సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకోవచ్చని అధికారిక వర్గాలు తెలిపాయి. JD(S)కి జాతీయ పార్టీలలో ఏదో ఒకదాని మద్దతు లభిస్తే ఒకదానిని గెలవవచ్చు.