ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు స్వాతి మాలివాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ఆఫీసులోనే తన మీద దాడి జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి సన్నిహిత సహచరుడు బిభవకుమార్ దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ మేరకు పోలీస్ ఫిర్యాదు కూడా చేశారు. దీని మీద జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశాలు ఇచ్చింది.
అయితే స్వాతి మాలివాల్ గొడవ వెనక రెండు మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. స్వాతి మాలివాల్ చాలాకాలంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు సన్నిహితులు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పటి నుంచి కీలకపాత్ర పోషిస్తున్నారు దీంతో ఆమెకు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు తాజాగా పార్లమెంట్ కూడా పంపించారు.
అయితే అరవింద కేజ్రీవాల్ అరెస్టు అయ్యాక పార్టీలో నెంబర్ 2 స్థానం కోసం స్వాతి ప్రయత్నం చేశారని తెలుస్తోంది ఇది సహజంగానే అరవింద కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ కి నచ్చలేదు. దీంతో పార్టీ ఆఫీసులో గొడవ జరిగిందని, సునీత సూచన మేరకే బిభవ కుమార్ కొట్టి బయటకు పంపించారని తెలుస్తోంది.
మరొక వాదన ప్రకారం స్వాతి మాలివాల్ ఇటీవల విడాకులు తీసుకున్నారు అప్పటినుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బాగా దగ్గరయ్యారని చెప్తున్నారు. ఈ సంగతి గమనించినప్పటికీ సునీత కేజ్రీవాల్ ముందుగా పట్టించుకోలేదు. కానీ రాను రాను పరిస్థితి ముదరడంతో ఆమె కలగజేసుకున్నారు అని తెలుస్తోంది. అందుచేతనే నమ్మకస్తుడైన విభవతో స్వాతిని బయటికి గెంటించినట్లు తెలుస్తోంది.
మరో వాదన ప్రకారం అరవింద కేజ్రీవాల్ మాత్రమే పార్టీకి నాయకత్వం వహించాలని స్వాతి పట్టుబడినట్లు చెబుతున్నారు . అందుచేతనే ప్రత్యర్థి వర్గాలు ఆమె మీద దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అరవింద్ భార్య సునీత కలగజేసుకుని కాపాడారని మరో వాదన వినిపిస్తోంది.
మొత్తం మీద ఈ గొడవలో మూడు ముక్కలాట నడుస్తోంది . అరవింద్ కేజ్రీవాల్,, ఆయన భార్య సునీత కేజ్రీవాల్ , మరోవైపు స్వాతీ మాలివాల్ ఈ ముగ్గురు మధ్య జరిగిన పరిణామాలే గొడవకు దారితీసాయని తెలుస్తోంది.