ఎన్నికల ఫలితాల తరువాత పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసాకాండను ఆర్ఎస్ఎస్ ఖండించింది. అల్లర్ల వెనక కుట్ర ఉన్నట్టు అనిపిస్తోందని సంఘ్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే ఓ ప్రకటన విడుదల చేశారు.
హింసను కట్టడి చేసి, శాంతిభద్రతలను అదుపు చేయడం అక్కడ ఏర్పడిన ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని ఆయన అన్నారు. హత్యాకాండ, ఘర్షణలకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని…ప్రజలకు భరోసా, భద్రత కల్పించాలనీ అన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కావల్సిన సహాయ సహకారాలను కేంద్రం ఇవ్వాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు కీలకమని … ఆసందర్భంగా రాజకీయ పక్షాలు ఎమోషనల్ స్టేట్ మెంట్లు ఇవ్వడం, వాదప్రతివాదాలు చేసుకోవడం సాధారణమని అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీచేస్తున్న పార్టీలన్నీ దేశానివేనని.. అభ్యర్థులు, వారి మద్దతుదారులు, ఓటేసిన పౌరంలంతా భారత పౌరులనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని హోసబలే అన్నారు.
రాష్ట్రంలోని మహిళలపై అఘాయిత్యాలు, అమాయకుల హత్య, ఆస్తుల ధ్వంసంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
హింస ఫలితంగా, నిరాశ్రయులైన ప్రజలు పారియిన సందర్భాల్ని ఆయన గుర్తు చేశారు. కూచ్ బిహార్ నుంచి సుందర్బన్స్ వరకు ప్రతిచోటా భయానక వాతావరణం నెలకొందన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. పోలీసులు, పాలనా యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, శాంతిభద్రతలను కాపాడటం ద్వారా సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పడం, సంఘ వ్యతిరేకులకు చట్టంపట్ల భయం కల్పించడం చేయాలన్నారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో బాధితుల పక్షాన నిలబడి ఆయా వర్గాల్లో విశ్వాసం కల్పించేలా చూడాలని… బెంగాల్ లోని మేధావులు, సామజిక, మత, రాజకీయ నాయకులనూ ఆయన కోరారు.