తెలంగాణలో బీఆర్ఎస్ తో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం అది జరగదన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నీ రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ ధృతరాష్ట్రుడి కౌగిలికి తాను బలికాదల్చుకోలేదన్నా రేవంత్…తమను అడ్డుకునేందుకు కేసీఆర్ ఆప్ కి సైతం డబ్బులిచ్చారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని..కేసీఆర్ బీజేపీ ఎజెండానే అమలుచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కెసిఆర్ లక్ష కోట్ల అవినీతి చేశారని, కానీ బీజేపీ అసలేమాత్రం ప్రశ్నించడం లేదన్నారు.