ఆప్ సర్కార్ , బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ 8 వందల కోట్లు సిద్ధం చేసుకుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఆరోపించారు. ఎక్సయిజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ దాడులు నిర్వహించిన మర్నాడు మనీశ్ సిసోడియాను బీజేపీ సంప్రదించిందని కేజ్రీవాల్ అన్నారు. ఇదే విషయాన్ని రెండురోజుల క్రితం సిసోడియా సైతం మీడియాసమావేశం పెట్టి వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆప్ ను చీల్చి వస్తే సీఎం పదవి ఇస్తామని సిసోడియాకు ఆశచూపారని..ఆప్ ఎమ్మెల్యేలు చావనైనా చస్తారు తప్ప అమ్ముడుపోరని కేజ్రీవాల్ అన్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీజేపీకి 40మంది ఎమ్మెల్యేలు ఉండాలని అందుకే 8 వందల కోట్లు సిద్ధం చేసుకుందని ఆయన ఆరోపించారు.
అటు బీజేపీ ఆపరేషన్ లోటస్ విఫలమవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ సహా ఆప్ ఎమ్మెల్యేలు మహాత్మా గాంధీ మెమోరియల్ను సందర్శించారు.అయితే కేజ్రీవాల్ సందర్శనతో మహాత్మాగాంధీ మెమోరియల్ అపవిత్రం అయిందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ శుద్ధి చేశారు. నీతిమాటలు మాట్లాడుతున్న కేజ్రీవాల్ నిండా అవినీతిలో కూరుకుపోయారని పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
https://twitter.com/ANI/status/1562708543404650497?s=20&t=MxR9pj2RKGbIukwcemOoig