మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వీధికుక్కల దాడిలో పిల్లవాడు చనిపోతే మేయర్ కనీస మానవత్వం లేకుండా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ అంబర్ పేటలో ఐదేళ్ల బాలుడు ప్రదీప్ పైకి వీధికుక్కలు ఎగబడి కరిచి చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. కుక్కలకు ఆకలేసిందని మేయర్ మాట్లాడడం సిగ్గుచేటని..మనుషులను కుక్కలు పీక్కుతినే దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని రేవంత్ అన్నారు. ఆ కుటుంబానికి పరిహారం అయినా ప్రకటించలేదని మండిపడ్డారు. రేవంత్ యాత్ర భూపాలపల్లి నియోజకవర్గంలోకి ఎంటరైంది. ఉదయం కొడవడంచ లక్ష్మీనర్సింహస్వామిని రేవంత్ దర్శించుకున్నారు.
మనుషులను కుక్కలు పీక్కుతినే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నై – మేయర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు – రేవంత్
Share: