పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలకు మారే శాసనసభ్యులు తిరిగి ఎన్నికయ్యే వరకు వారికి ఇతర పదవులు ఇవ్వరాదని పేర్కొన్నారు. బెంగళూరులోని ప్రెస్క్లబ్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఫిరాయింపుల నిరోధక చట్టంలో లొసుగులున్నాయని… అవి టోకు ఫిరాయింపులను అనుమతిస్తున్నాయని.అందవల్లే చాలా కేసులు సమర్థవంతంగా పరిష్కరం కావడం లేదని అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ స్వీయ ప్రవర్తనా నియమావళిని కలిగి ఉండాలని, వారి సభ్యులు దానిని అనుసరించేలా చూడాలని అన్నారు.