విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు గట్టి హెచ్చరిక చేసింది యోగీ సర్కారు.ఏకంగా 73 మందికి నోటీసులు జారీ చేసింది. జన్ సున్వాయ్ పోర్టల్, సీఎం హెల్ప్లైన్ ద్వారా స్థానిక యంత్రాగం, పోలీసులు, ఫేస్బుక్ నుంచి సీఎంఓ కార్యాలయానికి అందిన సమాచారం ఆధారంగా నోటీసులు ఇచ్చింది. వారిలో పదిమంది ఆయాశాఖల హెడ్లు ఉన్నారు. ఐదుగురు కమిషనర్లు, 10 మంది జిల్లా మెజిస్ట్రేట్లు, ఐదుగురు డవలప్మెంట్ అథారిటీ వైస్-ప్రెసిడెంట్లు, ఐదుగురు మున్సిపల్ కమిషనర్లు, 10 మంది తహసిల్దారులు కూడా ఉన్నారు. వీటితో పాటు ముగ్గురు ఏడీజీలు, ఐడీలు, ఐదుగురు ఐజీలు, డీఐజీలు, 10 కమిషనరేట్లు, 10 పోలీస్ స్టేషన్లను వివరణ ఇవ్వాలని కోరింది. ఫిర్యాదులు అందుకున్న శాఖల్లో పర్సనల్, ఆయుష్, టెక్నికల్ ఎడ్యుకేషన్, అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ డవలప్మెంట్, హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్, నమామి గంగే, రూరల్ వాటర్ సప్లయ్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమైట్ ఛేంజ్ శాఖలు ఉన్నాయి. గతంలో పోలీసులు శాఖ సహా పలు విభాగాల అధికారులతో సమావేశమైన సందర్భంగా కూడా డ్యూటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు స్పష్టం చేశారు యోగీ. ఎన్ని హెచ్చరికలు చేసినా పదేపదే ఫిర్యాదులు రావడంతో అధికారులపై చర్యలకు సిద్ధపడింది ప్రభుత్వం.