ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో భారత్ వంతెనను నిర్మిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో భారత రైల్వే ఈ వంతెన నిర్మిస్తున్నారు. రియాసి జిల్లాలోని కౌరి & బక్కల్ గ్రామాల వద్ద కత్రా-బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెన నిర్మాణం సాగుతోంది. జమ్మూ కాశ్మీర్ పర్వత భూభాగంలో ప్రయాణించడం స్థానికులకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. అందుకని మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలి అంతే కాకుండా జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా కలపాలి అని ఒక జాతీయ రైల్వే ప్రాజెక్టు నిర్మాణం 2002లో వాజపేయి హయాంలోనే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలో భాగంగా 2003 లోనే ప్రాజెక్ట్ ప్రారంభించారు. అసలైతే 2007 లోగా పూర్తి చేయాలి. జమ్మూ,బారాముల్లా ప్రాంతాల మధ్య 348 కిలోమీటర్ల పొడవైన రైల్వే మార్గం తలపెట్టారు. జమ్మూ నుండి ఉధంపూర్ విభాగం నిర్మాణం ఏప్రిల్ 2005 లోనే పూర్తయింది. ఉధంపూర్ నుండి బారాముల్లా విభాగంలో బానిహల్ స్టేషన్ (208 km) వరకు పనులు జరిగాయి. మిగతా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఇక ఈ ప్రాజెక్టులో అనేక వంతెనలు, సొరంగాల నిర్మిస్తున్నారు. వీటిలో చెనాబ్ వంతెన ఒకటి. నిర్మాణ సవాళ్ల కారణంగా ప్రాజెక్టును యుపిఎ ప్రభుత్వం 2008 లో నిలిపివేసింది. సవాళ్లకు పరిష్కారాలకోసం మొత్తం ప్రాజెక్టను సమీక్షించి 2009 లో మళ్లీ ఆమోదించారు. అయితే ఈ చినాబ్ వంతెన రూపకల్పనకు జూలై 2012 లోనే మాత్రమే ఆమోదం లభించింది. అంటే నాలుగేళ్లు వృధా అయింది. 2015 కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినప్పటికి పనుల్లో పెద్ద పురోగతి లేదు. 2014లో. మోడీ వచ్చాక ప్రోజెక్టు నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. 2017 నుండి నిర్మాణ వేగం పెరిగి ఆగస్ట్ 2022కి ఈ వంతెన నిర్మాణం పూర్తి అయింది.
ఇంత పెద్ద ఆర్చి టైప్ వంతెన దేశంలో ఇంతకు ముందు ఎక్కడా లేదు. “467 మీటర్ల వంపు విస్తీర్ణంతో, చెనాబ్ రైల్వే వంతెన దాదాపు పూర్తయింది. మోడీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణం జోరు పెరిగింది. 27,000 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు. ఈ వంతెన యొక్క పొడవు 1.315కి.మీ ఉంటుంది . “ఈ 111 కిలోమీటర్ల రైల్వే లైన్ 87% సొరంగాల గుండా వెళుతుంది. ఏడు శాతం ప్రయాణం వంతెన గుండా ఉంటుంది. సిద్ధంగా ఉన్న సొరంగాలలో ఒకటి 12.75 కిలోమీటర్ల పొడవు. ఇది భారతదేశపు అతి పొడవైన సొరంగం. వైష్ణో దేవిని సందర్శించే యాత్రికుల నుండి సాహసయాత్రకు వెళ్ళే పర్యాటకుల వరకు మరియు శ్రీనగర్ బారాముల్లాకు వెళ్లే హనీమూన్ జంటలకు ఈ రైలు ప్రయాణాలు ఎంతో మధురానుభూతిని మిగిలిస్తుంది.
ఈ రైల్వే మార్గం లో ప్రత్యేకమైనది ఏమిటంటే, చెనాబ్ వంతెన మీద గంటకు 90 కి.మీ గాలి వేగం ఉన్నప్పటికీ రైలు కి ప్రమాదం లేకుండా దానిపైకి వెళ్ళడానికి వీలుగా నిర్మిస్తున్నారు. పైన రైల్ లేని ఖాళీ వంతెన, ఎటువంటి రైలు కదలిక లేకుండా, గంటకు 266 కి.మీ వరకు గాలి వేగాన్ని తట్టుకోగలిగేటట్లు నిర్మిస్తున్నారు.దీనికోసం తోరణాలలో కాంక్రీట్ నిండిన ట్రస్సులను ఉపయోగిస్తున్నారు. ఈ తరహా నిర్మాణం భారతదేశంలో మొదటిసారిగా ఉపయోగించబడుతోంది. ఇప్పటికే చైనా, యుఎస్ మరియు కొన్ని యూరోపియన్ దేశాలలో కొన్ని వంపు వంతెనలలో ఈ పద్దతి ఉపయోగించారు.
దీనికి మరొక భద్రతను కూడా ఏర్పాటు చేసారు. అది ఏంటంటే గాలి వేగం గంటకు 90 కి.మీ మించి ఉంటే రైలు వంతెన మీదుగా వెళ్ళదు. రైల్వే మంత్రిత్వ శాఖ సైట్ వద్ద పనిచేసే ఇంజనీర్లు వంతెన యొక్క తనిఖీ మరియు నిర్వహణ కోసం పవర్ ఆపరేటెడ్ కార్లను నిర్వహిస్తారు. 359 మీటర్ల ఎత్తులో ఉన్న వంతెనను ” క్లోజ్డ్ ఇన్స్పెక్షన్ కారు ” ఉపయోగించి తనిఖీ చేస్తారు. ఇది తనిఖీ చేసే ఇంజనీర్లకు ఆఎత్తు భయం నుండి భద్రత కలిగిస్తుంది. వంతెన యొక్క సాధారణ నిర్వహణలో ఈ కార్ల వ్యవస్థ కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో ఏదైనా సామాజిక వ్యతిరేక అంశాల వల్ల అడ్డంకులు ఏవైనా సంభవించినప్పుడు కూడా వంతెనపై 30 కిలోమీటర్ల వేగంతో ట్రాఫిక్ ని నడపడం సాధ్యమవుతుంది.
భూగర్భ స్థాయిలో సంభవించే అనేక కిలోల బాంబు పేలుడు(TNT) ద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడి వంటి దానిని కూడా ఈ వంతెన తట్టుకోగలిగేటట్లు నిర్మిస్తున్నారు.ఆర్చ్ యొక్క మొత్తం బరువు 10,619 మెట్రిక్ టన్నులు.
చెనాబ్ నది ప్రాజెక్టును కొంకణ్ రైల్వేస్ నిర్వహిస్తోంది, అయితే ఫిన్లాండ్ (వయాడక్ట్ మరియు ఫౌండేషన్ కోసం), జర్మనీ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు నుండి UK ఐఐటి ఢిల్లీ మరియు రూర్కీ నుండి వచ్చిన డిజైనర్లు, ప్రూఫ్ కన్సల్టెంట్స్ వంతెన వాలును, స్థిరత్వాన్ని చూసుకుంటున్నారు.వంతెన ఖర్చు ఒక్కటే రూ .1,326 కోట్లు.”ఈ రైలు ప్రయాణంలో వైష్ణో దేవి, ఇంకా కశ్మీర్లోని హిమాలయ శిఖరాలను దర్శనం చేసుకోవచ్చు. వాతావరణం అనుకూలిస్తే మొత్తం 2004లో అనుకున్న మొత్తం రైల్ లింక్ ప్రాజెక్ట్ 2024 సం.కి పూర్తి కాగలదు అని అంచనా. ఈ వంతెన పూర్తి అయితే, ఇప్పటి వరకు ప్రపంచంలో అతి ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన వంతెన గా చైనాలోని 275 మీటర్ల ఎత్తైన బీపాన్ నది షుబాయి వంతెన ప్రపంచంలో రెండో స్థానానికి పడిపోతుంది.
చాడాశాస్త్రి