ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో …ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని…అయినా బడ్జెట్ సామాన్యుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందనే నమ్మకం ఉందన్నారు. ‘భారత దేశానికి పెద్ద పీట, ప్రజలకు పెద్ద పీట’ అనే భావాన్ని స్వీకరించి తాము ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు సైతం తమ అభిప్రాయాలు సభలో వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నానని మోదీ చెప్పారు.