మన చుట్టు ప్రక్కల దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది .. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల పరిస్థితి ఏమీ బాలేదనే వార్తలు వింటున్నాము .. ఇక శ్రీలంకలో అయితే అధ్యక్షుడే పారిపోయిన తీవ్ర ప్రజా విప్లవం. .ప్రపంచంలోనే నం. 1 అయిన చైనాలో కూడా బైటకు రానివ్వని, బైటపడనివ్వని రహస్య పాలన అయినా, బాంకుల economical downfall.
బాంకుల్లో డబ్బులేక ప్రజాగ్రహానికి గురిఅవుతున్న వార్తలు వింటున్నాము ..
దేశాల ఆర్ధిక పరిస్థితి ఇలా తలక్రిందులవటానికి ప్రధాన కారణం కరోనా ప్రజలను ప్రభుత్వాలను కృంగతీయటం, రెండవది రష్యా వుక్రియన్ల, పరోక్షంగా గా రష్యా నాటో దేశాల యుధ్ధం వలన ఆయిల్ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేయటం..
ఇన్నిదేశాల ఆర్ధిక పరిస్థితి ఇలా వూగిసలాడుతుంటే భారత్ లో మాత్రం ప్రజలు ఆయిల్ ధరలు కాస్త పెరిగినా ప్రశాంతంగా జీవించటానికి కారణం కేంద్రం తీసుకున్న వివేకవంతమైన తెగింపు నిర్ణయాలే కారణం ..
తెగింపు అనటానికి కారణం అమెరికా వ్యతిరేకతను లెక్కచేయకుండా రష్యా ఇచ్చిన ఆయిల్ డిస్కౌంట్ ధరను అందిపుచ్చుకోవటం.. కేంద్రం ప్రజలసంక్షేమం మీద మాత్రమే కేంద్రీకరించి పరిపాలన సాగిస్తోంది ..
ఈ సంగతి అర్ధమయినా మోడీజీ పరిపాలనను మతానికి ముడివేసి, అడ్డగోలుగా వ్యతిరేకించి కేంద్రప్రభుత్వం ని కూలతోద్దామనే దుర్మార్గం చర్యలు దేశప్రజలేఅయినా కొందరు దేశద్రోహులది .
దేశద్రోహమని ఎందుకంటున్నానంటే,.. మిగిలిన చుట్టుపక్కల దేశాలతో కంటే భారత్ ఆర్ధికంగా ధృఢంగా వుండి శ్రీలంక కు సహాయం చేస్తోంది.. ఈజిప్టు లాంటి దేశాలకు ఆహారధాన్యాల సప్లై చేస్తోంది…మన కోట్లాది ప్రజలకు వుచితంగా రేషన్ బియ్యం పంచగలులగుతోంది .
ఏ దేశ ప్రజలైనా ఇదాంటి నాయకత్వానికి జేజేలు పలకాలి ..దేశానికి గౌరవంగా సెల్యూట్ చేయాలి .
మనం ఇంకొకరికి పెట్టగలిగే స్ధితిలో వున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పి కేంద్రనిర్ణయాలను అభినందించాలి.. కానీ ఇక్కడ జరుగుతోందేమిటి ..ఇలాంటి సంక్షోభ పరిస్థితి లో దేశానికి సహకరించటం మానేసి, పాలకులను కించపరిచేలా అవమానించేలా అపనిందలు వేయటం అవహేళన లు చేయటం ని ఏమనాలి ?
ప్రపంచదేశాలన్నీ చాలా సంక్షోభంలో వున్నాయి ..భారత్ తెలివైన నిర్ణయాలతో, పట్టుతప్పే గుర్రానికి పగ్గాలు వేసి సరైన రహదారి లో పయనింప చేస్తోంది..ఇది ప్రత్యక్షంగా కనిపించే సత్యం ..
మోడీ జీ వ్యతిరేకులు లెవరైనా ఇంతకంటే బాగా పరిపాలన చేసారా ?చేయగలిగారా ? అని సూటిగా ప్రశ్నిస్తున్నా .జవాబుచెప్పండి ..
ఇలాటి క్లిష్ట సమయంలో తిట్లూ,ఆవేశాలూ చంపటాలూ, నరకటాలూ కాదు వివేకంతోకూడిన ఆలోచన కావాలి ..అధికారాలకోసం ఏపనైనా చేయటం ఎంతకైనా దిగజారటం విజ్ఞత కాదు..దానికి ఫలితం ప్రజలలో తిరస్కారం…80% ప్రజలు అమాయకులు కాదు ..ఎవరి పాలనలో సజావుగా బ్రతుకుతున్నారోవారికి తెలుసు ..
ఇక ఆర్ధిక సంక్షోబం ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది..ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన సమయం ..మీ డబ్బుని అనవసర ఖర్చులు మానేసి , అతి జాగ్రత్తగా ఖర్చుచేయాల్సిన సమయం .. విదేశి వుత్పత్తులు అసలు కొనకుండా జాగ్రత్త వహించండి మన డబ్బు మన దేశంలోనే మారకం జరుగుతూవుంటుంది .. ఆయిల్ సంక్షోభం మార్కెటింగ్ నియంత్రణ మన ప్రభుత్వాల చేతిలో వుండదు. ఎగుమతి తప్పనిసరి .. ఎంత హైక్ అయినా కొనకతప్పదు ..
దాని ధరను బట్టే నిత్యావసర ధరలు కూడా పెరుగవచ్చు పెరుగుతాయి కూడా ఆంధ్ర లో బియ్యం ఏ రాజస్ధాన్ కో చేరాలన్నా అక్కడ గోధుమలు ఇక్కడికి రావాలన్నా డీజిల్ కావాలి కదా .ఇక డీజిల్ ధరను బట్టి ధాన్యం కాని నిత్యావసర వస్తువుల ధరలు కాని పెరగకుండా ఎలా వుంటాయి ..
అందుకే ప్రజలు కూడా డబ్బును ఖర్చు పెట్టటంలో విజ్ఞత ప్రదర్శించాలి .. బాంకుల్లోనే కాదు చేతిలో కూడా మనీ వుంచుకోండి ..its better to check online purchasing that belongs to foreign countries..మన వారందరికీ స్వదేశీ కొనుగోలు కే first priority ఇవ్వమని విన్నపం.. దేశానికి మనవంతు సహాయం చేద్దాం చేయాలి ..ఇది మన ప్రియమైన దేశం కదా …జైహింద్
…అరుణ మల్లాప్రగడ