స్వతంత్ర భారత్ గడిచిన 70 సంవత్సరాలలో ఇప్పుడు ఎదుర్కొంటున్నంత వత్తిడి ఎప్పుడు ఎదుర్కోలేదు అనటంలోఎటువంటి అతిశయోక్తి లేదు, కరోనా యొక్క రెండవవేవ్ భారతదేశాన్ని ఆశ్చర్యంతో పాటు షాక్కు గురిచేస్తున్నది.గత సంవత్సరం కరోనా మొదటి వేవ్ ను సమర్ధవంతంగా ఏదుర్కోవటంలోఅటు ప్రభుత్వము ఇటు ప్రజలు సఫలమైనారు.ఆ సమయంలో అమెరికా లాంటి అగ్రదేశం ఒక సమయంలో నిస్సహాయ స్థితికి లోనయైనిది, మిగితప్రపంచాన్నీకరోనా ఒక కుదుపు కుదిపింది. ఆసమయంలో భారత్ సంక్షోభాన్ని అద్భుతంగాఎదుర్కొంది. అత్యవసరంగా హాస్పటల్స్ నిర్మాణం చేయించింది , మౌలిక వసతుల నిర్మాణ పనులు చేసింది, ఆర్ధిక సంక్షోభాన్నిఎదుర్కొంటుకూడా జీవనోఫాది కోల్పోయిన లక్షలాది మందికి ఆసరాగా నిలబడింది . ఇప్పుడు అకస్మాత్ గా విరుచుకుపడుతున్న రెండవవేవ్ ను ఎదుర్కోవడంలో కూడా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొంటూ అవసరాలను పూరించుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనేఉన్నారు. ప్రకృతి విధించిన అత్యవసర పరిస్థితి లోకూడా రాజకీయాలు చేస్తూ కొన్ని రాజకీయపక్షాలు మనదేశ ప్రధానిని అసమర్థ నిర్వాహకుడిగా చూపించడానికి ఏ చిన్నసందర్భాన్ని వదులుకోవడం లేదు, ప్రభుత్వమూ పరిస్థితులను ఎదుర్కోవటానికి ఎటువంటి ముందస్తు ప్రణాళికలను రూపొందించలేదని ప్రచారం చేస్తున్నారు. ప్రజలలో భయభ్రాంతులనునిర్మాణం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు,
భారత ప్రజాస్వామ్యం లో వ్యక్తిగత స్వేచ్ఛ మరియు వాక్ స్వాతంత్య్రం కి ఎటువంటి హద్దులు లేవు అని మన దేశంలోని అత్యధిక ప్రసార మాధ్యమాలు మరోసారి నిరూపిస్తున్నాయి. కరోనా యొక్క రెండవవేవ్ లో నిర్మాణమైన పరిస్థితులను విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ, ప్రతి విచారకరమైన సంఘటనను “బ్రేకింగ్ న్యూస్” గా అభివర్ణిస్తూ ప్రజల మనోధైర్యం చెదరకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంమీద కొన్ని ప్రసార మాధ్యమాలకు, ప్రతిపక్ష రాజకీయ నాయకులకు మన ప్రధాని అసమర్థుడని ప్రజలకు చూపించేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి విధించిన అత్యవసర పరిస్థితులలో దేశమంతా ఒకటిగా నిలబడి ప్రజలలో ధైర్యాన్ని నిర్మాణం చేయాలి అది చేయకపోగా ఒక ప్రక్క మనదేశ గౌరవ ప్రతిష్టలు ప్రపంచం ముందు దిగజారుస్తూ మరోప్రక్క దేశ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి మన దేశ రాజకీయాలు కొన్ని మీడియాసంస్థలు . 75సంవత్సరాల మన స్వతంత్ర భారతం ఎదుర్కొంటున్నఅతి పెద్ద మౌలిక సమస్య , ఇది కూడా దేశానికీ పెద్దసవాలే.
కేంద్ర ప్రభుత్వముపై చేస్తున్న ఆరోపణలలో
1] రెండవ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటలో విఫలమైంది అనేది పెద్ద ఆరోపణ, అట్లాగే భారతదేశంలో ఉత్పత్తి అయినా వ్యాక్సిన్ల ను మన ప్రధాని మనదేశంలో నే ఉపయోగించకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు తన వ్యక్తిగత ప్రతిష్టలు పెంచుకోవటానికి పంపించాడని ఆరోపిస్తున్నారు.
2] వాళ్ళుచేసే మరో విమర్శ ఏమిటంటే ఆసుపత్రులకు అవసరమైన మేరకు వైద్య ఆక్సిజన్ను అందుబాటులో ఉంచలేకపోయారు. ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారు. కేంద్రం ఏమి చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. భారతదేశం లో సాధారణ కాలానికి అవసరమైన వైద్య ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది, కాని ప్రస్తుతము వంటి అసాధారణ పరిస్థితులకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేసి అవసరమైన ప్రాంతాలకు రోడ్, రైలు మరియు వాయుమార్గాల ద్వారా ఆక్సిజన్ ని పంపిస్తున్నారు క్రొత్త క్రొత్త ఆక్సిజన్ ప్లాంటులను నిర్మాణం చేస్తున్నారు, ప్రపంచం లో చిన్న చిన్న దేశాలకు వ్యాక్సిన్ అందించిన వ్యాక్సిన్ తయారీ కొనసాగిస్తూనే ఉన్నది.
భారత ప్రభుత్వం వచ్చేఆగష్టు 2021 నాటికి దాదాపు 350 మిలియన్ల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది, దానిని సాధించేందుకు ప్రభుత్వం లాజిస్టిక్స్ మరియు టీకాల ఉత్పత్తి మరియు సరఫరాలను క్రమంగా మెరుగుపరుస్తున్నది. కొన్నిటీకా కేంద్రాలను రౌండ్ ది క్లోక్ అంటే 24 గంటలు వేసే ఏర్పాట్లు చేస్తున్నారు 2021 ఏప్రిల్ 10 నాటికి, 100 మిలియన్ మోతాదులను అందించిన అత్యంత వేగవంతమైన దేశంగా భారత్ నిలిచింది .ప్రారంభంలో సుమారు తొమ్మిది మిలియన్ల మంది ఆరోగ్య కార్యకర్తలు మరియు 10 మిలియన్ల మంది ఫ్రంట్లైన్ కార్మికులుఒక మోతాదు వ్యాక్సిన్ను అందుకున్నారు. తదుపరి లక్ష్యము 45 ఏళ్లు పైబడిన 60 మిలియన్లకు పైగా ప్రజలు. ప్రస్తుతం 45 ఏళ్ల మరియు అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారికి మే 1st నుండి టీకాలు వెయ్యబోతున్నారు .
జాతీయ టీకా కార్యక్రమం కోసం రోజుకు సగటున నాలుగు మిలియన్ మోతాదులను పంపిణీచేయబడుతుందని అంచనా వేయబడింది.దానికోసం COVID-19 వ్యాక్సిన్ల ఉత్పత్తి పంపిణి వేగవంతం చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అంటే ఆర్ధిక వనరులనుండి అన్నింటిపై దృష్టిసారించింది. కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి సంబంధించిన అన్నిరకాల పరిశోధనలు మరియు ఉత్పత్తి ప్రైవేటు రంగంలోనే జరుగుతున్నది ప్రభుత్వం మాత్రం మోతాదు ధరనిర్ణయిస్తుంది.స్వదేశీ ఉత్పత్తులతోపాటు యుఎస్, రష్యా , మరియు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల వంటి కొన్ని ఇతర దేశాల విదేశీ-ఉత్పత్తి COVID-19 వ్యాక్సిన్ల దిగుమతి కోసం ప్రభుత్వంఇప్పటికే తన నిర్ణయాన్నిప్రకటించింది.
మొత్తం మీద టీకా అందరికి వేసే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేస్తున్నది ఇన్ని ప్రయత్నాలు వెంటవెంటనే జరిగిపోతూ వుంటే మీడియా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మనం ఎట్లా అర్ధం చేసుకోవాలి? .సిద్ధాంతం కళ్ళకు గంతలు కడుతుంటే ,విద్వేషం తో నిండిన మనస్సు విచక్షణ కోల్పోతున్నది అటువంటి వాళ్ళ వ్యవహారం ఇంతకంటే గొప్పగా ఏమి ఉండదు. అట్లా మీడియా ప్రతిపక్షాలు విచక్షణ కోల్పోయి దేశ గౌరవానికి భంగం కలిగిస్తున్నచర్యలను తీవ్రంగా గర్హించాలి.
ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దేశమంతా ఒక్కటిగా నిలబడుతుందనేది మనదేశం చరిత్ర లో అనేక సందర్భాలుసాక్ష్యం గా కనబడతాయి, అది మనదేశ స్వభావం. ప్రకృతి విధించిన ఈ అత్యవసర పరిస్థితులలో దేశమంతా ఒక్కటిగా నిలబడి ప్రజలను కాపాడుకోవాలి